America: భారత సాయాన్ని మరువలేం
కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో భారత్కు తమకు అండగా నిలిచిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పునరుద్ఘాటించారు. భారత్ సాయాన్ని అమెరికా....
వాషింగ్టన్: కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో భారత్ తమకు అండగా నిలిచిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పునరుద్ఘాటించారు. భారత్ సాయాన్ని అమెరికా ఎప్పటికీ మరువలేదన్నారు. ప్రస్తుతం కరోనాతో సతమతమవుతున్న భారత్కు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే అనేక అంశాల్లో భారత్, అమెరికా పరస్పర సహకారంతో కలిసి ముందుకు సాగుతాయని ధీమా వ్యక్తం చేశారు. కొవిడ్ మహమ్మారిపైనా కలిసే పోరాడుతామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారం బ్లింకెన్తో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బైడెన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమెరికాలో పర్యటించిన తొలి క్యాబినెట్ స్థాయి మంత్రి జైశంకరే కావడం విశేషం. కరోనా కష్టకాలంలో వివిధ రూపాల్లో భారత్కు అండగా నిలిచిన అమెరికాకు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్లింకెన్తో భేటీ సందర్భంగా అనేక అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య బంధం బలపడిందని పేర్కొన్నారు. అంతకుముందు అమెరికా రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్తోనూ జైశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఉన్న అవకాశాలపై చర్చించినట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తుత సమయంలో నెలకొన్న భద్రతా సమస్యలపై సమాలోచనలు జరిపినట్లు పేర్కొన్నారు. కొవిడ్పై పోరులో ముందున్న అమెరికా సైనిక వ్యవస్థని ఈ సందర్భంగా అభినందించినట్లు వెల్లడించారు.
అలాగే కొవిడ్ టీకాల విషయమై సహాయం కోరుతూ జైశంకర్ అమెరికాలోని పలువురు ప్రముఖులతో చర్చలు జరిపారు. డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన ప్రభావశీలురైన శాసనకర్తలతో ఆయన భేటీ అయ్యారు. విదేశీ వ్యవహారాల సభా సంఘం ఛైర్మన్ గ్రెగరీ మీక్స్, ఇండియా కాకస్ ఛైర్మన్ బ్రాడ్ షెర్మాన్, వాణిజ్య ప్రతినిధి కేథరిన్ తాయ్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్తోనూ భేటీ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.