Afghanistan: కరవు.. కరోనా.. పోలియో.. ఆపై తాలిబన్లు..!
అఫ్గాన్ జాతీయుల పరిస్థతి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఇప్పటికే ఆ దేశంలో మూడోంతుల ప్రాంతం తీవ్రమైన కరవుతో ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటం..
* దయనీయంగా మారిన అఫ్గానిస్థాన్ వాసుల జీవితాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అఫ్గాన్ జాతీయుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఇప్పటికే ఆ దేశంలో మూడువంతుల ప్రాంతం తీవ్రమైన కరవుతో ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటం.. వ్యాక్సిన్ల లభ్యత తగ్గిపోవడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచునకు చేరాయి. తాజాగా పాలనా పగ్గాలు తాలిబన్లు చేపట్టడంతో వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. వారు ఇప్పటికే పోలియో టీకాలను వ్యతిరేకిస్తున్నారు. ఇక కరోనా టీకాలను కూడా దేశంలోకి రానీయరనే భయాలు ఉన్నాయి.
దేశం మొత్తం కరవు కోరల్లో..
అఫ్గానిస్థాన్లో కరవు నెలకొన్నట్లు జూన్ 22వ తేదీన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రకటించారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్ అండ్ రెడ్క్రాస్ సొసైటీస్ ప్రకారం దేశంలో 30శాతం భూభాగంలో అత్యంత తీవ్రమైన కరవు నెలకొంది. 50శాతం తీవ్రమైన కరవు ఉండగా.. మరో 20శాతం భూభాగంలో ఓ మోస్తరు కరవు నెలకొంది. దేశంలోని గోధుమల ఉత్పత్తి రెండు మిలియన్ టన్నులకు పడిపోగా.. మూడు మిలియన్ల పశువులు, ఇతర జీవాలు మృత్యువు ముంగిట నిలిచాయి.
యూఎస్ ఎయిడ్ ఏప్రిల్2020లో ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రజలకు ఆహారం లభించని పరిస్థితి నెలకొంది. అఫ్గాన్ జనాభాలో సగం మంది కటిక పేదరికంలో ఉన్నారని పేర్కొంది. వీరిలో 11 మిలియన్ల మందికి ఆహారం కూడా అందడంలేదని వెల్లడించింది. గతేడాది న్యూట్రిషియన్ క్లస్టర్ లెక్కల ప్రకారం 3.5మిలియన్ల మంది బాలింతలు, పసిపిల్లల్లో పోషక లోపాలు ఉన్నాయని పేర్కొంది.
విజృంభిస్తున్న కొవిడ్..
ఇక్కడ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి. మొత్తం నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే.. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది జులై వరకు కేవలం 5,00,000 పరీక్షలు మాత్రమే నిర్వహించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. వీటిల్లో 1,51,770 పాజిటివ్లు వచ్చాయి. ఇక్కడ పాజిటివిటీ రేటు 42శాతం ఉన్నట్లు ఐరాస నివేదిక పేర్కొంది.
ఆగస్టు 13 నాటికి 7వేల మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆగస్టులో కేసులు తగ్గుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ, సంక్షోభ సమయంలో ఇక్కడ ఏమేరకు పరీక్షలు జరుగుతున్నాయనేది అనుమానాస్పదమే.
డౌన్టు ఎర్త్లెక్క ప్రకారం దేశంలో మొత్తం 18లక్షల డోసుల కొవిడ్ టీకాలను మాత్రమే ఇప్పటి వరకు పంపిణీ చేశారు. గత నెలలలో కోవ్యాక్స్ కార్యక్రమం కింద జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ నుంచి 14లక్షల టీకాలు దేశానికి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకొన్నవారి సగటు రేటు 23.6శాతం ఉంటే.. అఫ్గానిస్థాన్లో అది 0.6శాతం వరకు ఉంది.
గతవారం తాలిబన్లు పక్తియా ప్రావిన్స్లో కొవిడ్ టీకాల కార్యక్రమాన్ని బ్యాన్ చేశారు. ఇటీవల వారు గుంపులుగా అధ్యక్ష భవనంలోకి చొరబడినప్పుడు ఒక్కరు కూడా మాస్కు ధరించి లేరు. తాలిబన్ల ఆక్రమణతో చాలా మంది వలస పోతుండటంతో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించే ప్రమాదం ఉంది. ఫలితంగా పొరుగున ఉన్న పాక్,ఇరాన్ వంటి దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది.
పోలియో చుక్కలపై తాలిబన్లకు పగ..!
ప్రపంచంలో పోలియో వైరస్ ఇంకా చురుగ్గా ఉన్నదేశాలు రెండే ఉన్నాయి. వాటిల్లో అఫ్గానిస్థాన్ కూడా ఒకటి. 2020లో ఇక్కడ 56 పోలియో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు వరుసగా మూడేళ్లపాటు రాకుండా ఉంటేనే పోలియో రహిత దేశంగా ప్రకటిస్తారు. అఫ్గానిస్థాన్ పోలియో నిర్మూలన యాక్షన్ ప్లాన్ (ఎన్ఈఏపీ) ప్రకారం తాలిబన్ ఆధీనంలోని ప్రాంతాల్లో పోలియో నిర్మూలన కార్యక్రమంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. ఇక్కడ ఇంటింటికి తిరిగి టీకాలు వేయడంపై మూడేళ్లుగా నిషేధం అమల్లో ఉంది.
ఈ ఏడాది జూన్లో నాన్గ్రాహర్ ప్రావిన్స్లో పోలియో వ్యాక్సిన్ వేసే కార్యకర్తలను తాలిబన్లు కాల్చి చంపారు. ఇక ఏప్రిల్లో జలాలాబాద్లో ముగ్గురు మహిళా ఆరోగ్య కార్యకర్తలను హత్య చేశారు. భద్రతా పరమైన కారణాలతో పోలియో నిర్మూలన కార్యక్రమ వేగం మందగించడంతో మిలియన్ల కొద్దీ పిల్లలకు టీకాలు లభించలేదని లాన్సెన్స్ పత్రిక పేర్కొంది.
తాజాగా అమెరికా సేనలు అఫ్గానిస్థాన్ను వీడిపోవడంతో దాదాపు 30 ఏళ్ల నుంచి చేపట్టిన పోలియో నిర్మూలన కార్యక్రమం కుంటుపడే ప్రమాదం నెలకొంది. 2021లో ఇప్పటి వరకు ఒక పోలియో కేసు వచ్చింది. కానీ, ఇప్పుడు అఫ్గాన్లోని పరిణామాలు వ్యాక్సినేషన్ను మందగింపజేస్తాయని యేల్ విశ్వవిద్యాలయ ఎపిడమాలజిస్టు సాద్ బి ఒమర్ పేర్కొన్నారు. అఫ్గాన్తోపాటు పోలియో కేసులు నమోదవుతున్న మరో దేశం పాకిస్థాన్.. భూమిపై ఈ రెండు దేశాల్లోనే పోలియో కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ