కొవిడ్ మూలాలు అక్కడే..! WHO
కొవిడ్ మూలాలపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. కరోనా వైరస్కు మూలాలకు చైనాలోని వన్యప్రాణి పెంపకం కేంద్రాలే కారణమై ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు భావిస్తున్నారు.
మరికొన్ని వారాల్లో విడుదల కానున్న దర్యాప్తు నివేదిక
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి బయటపడి ఏడాది పూర్తయినా ఇప్పటికీ వాటి మూలాలపై స్పష్టత రాలేదు. వీటిపై దర్యాప్తు చేపట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని ప్రత్యేక బృందం.. వుహాన్ ల్యాబ్నుంచి వైరస్ లీక్ అయ్యే అవకాశాలను కొట్టిపారేసింది. ఇలా కొవిడ్ మూలాలపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. కరోనా వైరస్ మూలాలకు చైనాలోని వన్యప్రాణుల పెంపకం కేంద్రాలే కారణమై ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు భావిస్తున్నారు.
కరోనా వైరస్ మూలాలు తొలుత వుహాన్లోని సముద్రపు ఆహార మార్కెట్లో బయటపడినట్లు ఇప్పటివరకు అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. కానీ, ఇవి ఆ మార్కెట్కు ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. వీటిపై దర్యాప్తు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కూడా కొవిడ్ మూలాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సమయంలో కరోనా వైరస్కు దక్షిణ చైనాలోని వైల్డ్లైఫ్ ఫామ్లు మూలమై ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అక్కడి నుంచి వుహాన్ మార్కెట్కు జంతువులను సరఫరా చేసే వాటిలో కొవిడ్కు సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు దర్యాప్తులో పాల్గొన్న అమెరికా శాస్త్రవేత్త పీటర్ డేస్జాక్ స్పష్టంచేశారు. వైల్డ్లైఫ్ ఫామ్లలో లభించే వన్యప్రాణులకు తొలుత గబ్బిలాల నుంచి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం ఆయా జంతువుల నుంచి కరోనా వైరస్ మానవులకు సోకినట్లు చైనా ప్రభుత్వం కూడా భావించినట్లు పీటర్ డేస్జాక్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వైల్డ్లైఫ్ ఫామ్ల నుంచే..?
పేదరికాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా గత కొన్నేళ్లుగా అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో వన్యప్రాణుల పెంపకాన్ని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వాటిలో ముఖ్యంగా పంగోలిన్లు, కొన్ని రకాల కుక్కలు, ఎలుకలు, పందికొక్కులను ప్రత్యేకంగా ఫామ్లలో పెంచుతారు. వీటిలో ఎక్కువగా కరోనా వైరస్ రకాలను వ్యాపింపజేసే ప్రాణులే ఉండడం గమనార్హం. చైనాలో కరోనా వైరస్ బయటపడిన వెంటనే ఫిబ్రవరి(2020) మాసంలో ఈ కేంద్రాలను అక్కడి అధికారులు మూసివేశారు. తొలుత గబ్బిలాల నుంచి అక్కడ పెంచే జంతువులకు, అనంతరం మానవులకు సంక్రమించి ఉండవచ్చని భావించిన చైనా ప్రభుత్వం వాటిని మూసివేసినట్లు డేస్జాక్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలా కట్టడి చేయాలో అక్కడి రైతులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా వన్యప్రాణులను చంపడం, వధించిన వాటిని పూడ్చిపెట్టడం లేదా కాల్చివేయడంపై వన్యప్రాణుల పెంపకందార్లకు చైనా ప్రభుత్వం తగు సూచనలు చేసిందని చెప్పారు.
దక్షిణ చైనాలోని యున్నాన్ ప్రావిన్సులో గబ్బిలాల్లో లభ్యమైన వైరస్ సార్స్-కోవ్-2తో దాదాపు 96 శాతం పోలికను కలిగివుందని తేలింది. వీటికి తోడు ఆయా కేంద్రాల్లో పెంచే జంతువులు కూడా కరోనావైరస్ను వ్యాప్తిచేసేవే కావడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోందని డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు డేస్జాక్ పేర్కొన్నారు. చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన దర్యాప్తులో ఇందుకు కావాల్సిన రుజువులు కనుగొన్నట్లు వెల్లడించారు. వుహాన్లో సీ ఫుడ్ మార్కెట్ను రాత్రికి రాత్రే మూసివేయడం వంటి చర్యలు చూస్తుంటే అక్కడ తీవ్ర స్థాయిలో వైరస్ వ్యాప్తి జరిగి వుంటుందని సింగపూర్కు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ లింఫా వాంగ్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తు బృందంలో మరోసభ్యుడిగా ఉన్న లింఫా వాంగ్.. వైరస్ బయటపడిన తర్వాత ఆ ప్రాంతాన్ని చైనా శాస్త్రవేత్తలు వెళ్లి పరిశీలించారని చెప్పారు.
వన్యప్రాణి కేంద్రాల్లో కరోనా వైరస్ మూలాలు ఉన్నాయని భావిస్తున్నప్పటికీ, అక్కడి ప్రజలకు మాత్రం తొలుత ఈ వైరస్ వ్యాపించకపోవచ్చని డేస్జాక్ అభిప్రాయపడ్డారు. తొలి కేసు వుహాన్లోనే బయటపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక దర్యాప్తు జరిపినప్పటికీ ఇంకా తుది నివేదిక విడుదల చేయలేదు. ఆ నివేదిక మరికొన్ని వారాల్లోనే విడుదల కానున్న నేపథ్యంలో దర్యాప్తు బృందంలోని సభ్యులు కొవిడ్ మూలాలపై తమకున్న సమాచారాన్ని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!