china:జాంగ్ గవోలీ అనే కొండను ఢీకొన్న పెంగ్ షువాయి..!
ఇటీవల చైనా టెన్నిస్ సూపర్ స్టార్ క్రీడాకారిణి పెంగ్ షువాయి అదృశ్యంతో మాజీ వైస్ ప్రీమియర్ జాంగ్ గవోలీ పేరు తెరపైకి వచ్చింది.
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల చైనా టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి పెంగ్ షువాయి అదృశ్యంతో మాజీ వైస్ ప్రీమియర్ జాంగ్ గవోలీ పేరు తెరపైకి వచ్చింది. ఆయనపై ఆరోపణలు చేసిన తర్వాత ఇప్పటి వరకూ పెంగ్ ఆచూకీ లేదు. అప్పుడప్పుడు పెంగ్ ఫొటోలు, వీడియోలు చైనా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మరో వైపు గవోలీ బీజింగ్ వింటర్ ఒలింపిక్స్, బీఆర్ఐ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో పనిచేశాడు. తనపై ఆరోపణలు చేయగానే ఏకంగా ప్రపంచ టెన్నిస్ సూపర్ స్టార్ క్రీడాకారిణినే కనుమరుగు చేసేంత శక్తిమంతుడా గవోలీ. జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు పెంగ్ షువాయి ఏకంగా కొండనే ఢీకొంది.
జిన్పింగ్ సన్నిహితుల్లో ఒకడిగా..?
మూడేళ్ల క్రితం జాంగ్ చైనా కమ్యూనిస్టు పార్టీ పదవి నుంచి రిటైర్ అయ్యారు. అప్పటి వరకు ఆయన దేశ వైస్ ప్రీమియర్గా వ్యవహరించారు. దీంతోపాటు చైనాలోనే అత్యంత బలమైన సీసీపీ పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా చేశాడు. ఈ కమిటీలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సన్నిహితులకు తప్పితే మరొకరికి స్థానం దక్కదు. ఇక బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రాజెక్టుకు ఆయన పనిచేశాడు. జాంగ్ కెరీర్లో ఒలింపిక్స్ ఒక చిన్న భాగం మాత్రమే.
జాంగ్ చైనా ఎకనామిక్ పాలసీకి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. దీంతోపాటు జిన్పింగ్ మానసపుత్రికగా పేరున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా బాధ్యుడిగా పనిచేశారు. ప్రస్తుత ప్రీమియర్ లీ కిక్వియాంగ్, చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్కు అత్యంత సన్నిహితుడు. చైనా కమ్యూనిస్టు పార్టీలో అత్యంత శక్తిమంతమైన షాంఘై ఫ్యాక్షన్ జియాంగ్ జెమిన్ కనుసన్నల్లోనే ఉంటుంది.
నిశ్శబ్దంగా సీసీపీలో ఎదిగి..
జాంగ్ చైనా కమ్యూనిస్టు పార్టీలో చాలా నిశ్శబ్దంగా ఎదిగారు. ఆయన 1946లో ఫుజియాన్ ప్రావిన్స్లో ఓ రైతు కుటుంబంలో పుట్టారు. 1970లో జియామెన్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో పట్టా అందుకొన్నారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని మావోమింగ్ పెట్రోలియం కంపెనీలో చేరారు. ఆ తర్వాత మెల్లగా ఆ కంపెనీ అధిపతిగా.. 1988లో ఆ రాష్ట్ర డిప్యూటీ గవర్నర్గా ఎదిగారు. అదే సమయంలో విద్యుత్తు కొరత తీర్చేందుకు ధరల్లో సంస్కరణలు తీసుకొచ్చి విజయం సాధించారు. దీంతో సీసీపీ పెద్దల దృష్టి జాంగ్పై పడింది. షెన్జెన్ గవర్నర్గా ఆయనని నియమించారు. అక్కడే ఆధునిక చైనా ఆద్యుడు డెంగ్ షావోపింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత షెన్జెన్ చైనాలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత సాన్డాంగ్లో గవర్నర్గా పనిచేశారు. 2012లో సీసీపీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీలో సభ్యత్వం పొందాడు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అత్యంత నమ్మకస్తుల్లో జాంగ్ ఒకరు.
బీఆర్ఐ స్టీరింగ్ కమిటీ అధిపతిగా..
2014 తర్వాత ప్రపంచాన్ని గుప్పిట పెట్టుకొనేందుకు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషేటీవ్ను ప్రారంభించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. ఈ ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీకి జాంగ్ గవోలీ అధ్యక్షత వహించాడు. ఆయన కింద సీసీపీలోని పలువురు సీనియర్ నాయకులు పనిచేశారు. ఈ కమిటీ నేరుగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ చైనాకు రిపోర్టు చేసేది.
అందుకే జాంగ్పై ఆరోపణలు బయటకు పొక్కగానే చైనా అధికారులు రంగంలోకి దిగారు. చైనా ఇంటర్నెట్లో ఎక్కడా పెంగ్ షువాయి చేసిన ఆరోపణలు కనిపించకుండా తొలగించేశారు. ఆ పోస్టు చేసినప్పటి నుంచి పెంగ్ ఆచూకీ దొరకడం లేదు. దీంతో పెంగ్ ఎక్కడ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం మొదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్