Omicron: వ్యాక్సిన్లు వైరస్ సోకే అవకాశాలను తగ్గిస్తాయే తప్ప పూర్తిగా అడ్డుకోవు
‘కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ప్రస్తుత వ్యాక్సిన్లు అడ్డుకుంటుందా?’.. ఇప్పుడు ప్రపంచమంతా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుక్కుతోంది. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా
WHO ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్
(Photo Credit: who.int)
ఇంటర్నెట్ డెస్క్: ‘ప్రస్తుత కొవిడ్ వ్యాక్సిన్లు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను అడ్డుకుంటాయా?’.. ఇప్పుడు ప్రపంచమంతా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషిస్తోంది. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డబ్ల్యూహెచ్వో ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. కొవిడ్ వ్యాక్సిన్లను తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు.
‘ఒమిక్రాన్పై కొవిడ్ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయా? లేదా? అనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఒమిక్రాన్లో బహుళ సంఖ్యలో ఉత్పరివర్తనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్ తీవ్రత, మరణం నుంచి కాపాడగలవని భావించడం సరైందే. అయితే, వ్యాక్సిన్లను ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాల్సి ఉంటుంది. టీకాలు తీసుకున్నా.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఒమిక్రాన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగా వారికే బూస్టర్ డోస్ ఇవ్వాలి. ప్రస్తుతం బూస్టర్ డోసు వల్ల కలిగే ప్రయోజనాలు.. ప్రాథమిక వ్యాక్సిన్లను విస్తృతంగా పంపిణీ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై శాస్త్రవేత్తలు సమీక్షిస్తున్నారు’’అని డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ తెలిపారు.
వ్యాక్సిన్లు వైరస్ సోకే అవకాశాలను తగ్గిస్తాయే తప్ప పూర్తిగా అడ్డుకుంటాయని భావించొద్దని డాక్టర్ పూనమ్ స్పష్టం చేశారు. ఇది అన్ని వేరియంట్లకు వర్తిస్తుందన్నారు. ‘తీవ్రమైన అనారోగ్యం, మరణాలను నివారించడం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కాపాడాల్సిన సందర్భంలో మాత్రమే బూస్టర్ డోస్ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’అని డాక్టర్ పూనమ్ చెప్పారు. పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావంపై ఎలాంటి సమాచారం లేదన్నారు. కొవిడ్ ముప్పు అధికంగా ఉన్న చిన్నారుల్లో ఒమిక్రాన్ ప్రభావం స్వల్పంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అందుకే, చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ చేపట్టాలని, తద్వారా వారిని ఒమిక్రాన్ ముప్పు నుంచి తప్పించవచ్చని డాక్టర్ పూనమ్ తెలిపారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు