WHO: చైనాను బలవంతం చేయలేం..!
చైనాలో వెలుగు చూసిన వైరస్పై మరింత సమాచారం కోసం ఆ దేశాన్ని బలవంతం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.
కొవిడ్ మూలాల సమాచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ
వాషింగ్టన్: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారి మూలాలపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో వెలుగు చూసిన వైరస్పై మరింత సమాచారం కోసం ఆ దేశాన్ని బలవంతం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అయితే, ఈ విషయంలో సభ్యదేశాల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
‘కరోనా మూలాల సమాచారంపై ఎవరినీ ఒత్తిడి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎలాంటి అధికారాలు లేవు. కేవలం అన్ని సభ్యదేశాలు ఈ విషయంలో పూర్తి సహాయ, సహకారం అందిస్తాయని మాత్రం ఆశిస్తున్నాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర కార్యక్రమాల డైరెక్టర్ మైక్ రేయాన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మానవులకు సోకిందనే వాదనలు ఉన్నాయి. లేదా వుహాన్ ల్యాబ్ నుంచి లీకై ఉండవచ్చనే థియరీలు వెలువడుతున్నాయి. ఇలా భిన్న వాదనలు వస్తోన్న నేపథ్యంలో వైరస్ మూలాలను అర్థం చేసుకోవడానికి మరింత అధ్యయనం అవసరమని మైక్ రేయాన్ ప్రతిపాదించారు.
ఏడాదిన్నర దాటినా కరోనా వైరస్ మూలాలపై మిస్టరీ వీడకపోవడంతో ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు తమ స్వరం పెంచుతున్నాయి. ముఖ్యంగా వైరస్ వుహాన్ ల్యాబ్లోనే లీకైందనేందుకు ఆధారాలను వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ ల్యాబ్లోనే సృష్టించారనడానికి మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయని బ్రిటిష్, నార్వే శాస్త్రవేత్తలు ఈమధ్యే ఓ నివేదికలో పేర్కొన్నారు. అది బాహ్య ప్రపంచంలోకి వ్యాపించక ముందే వుహాన్ ల్యాబ్లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురైనట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక చైనా శాస్త్రవేత్తలు జీవాయుధాల (Bioweapons) గురించి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో కొవిడ్ మూలాలపై మూడు నెలల్లో తేల్చి ఓ నివేదిక ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా ఇంటెలిజెన్స్ విభాగాన్ని అదేశించారు. ఇక కొవిడ్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని బృందం జరిపిన దర్యాప్తు ఫలితాలు అస్పష్టంగా ఉండడంతో వీటిపై మరోసారి దృష్టి సారించాల్సి ఉందని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఇదివరకే అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!