Vaccination: స్పెయిన్దే అగ్రస్థానం.. ఎలా సాధ్యమయిందంటే?
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా రకం వ్యాప్తి తీవ్రతతో ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. అగ్రదేశం అమెరికాలో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి.
మాడ్రిడ్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా రకం వ్యాప్తి తీవ్రతతో ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. అగ్రదేశం అమెరికాలో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసులు పెరగకుండా కొన్ని దేశాలు లాక్డౌన్ ఆంక్షలు విధించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రాయెల్, బ్రిటన్, యూఏఈ, రష్యా, బెహ్రెయిన్ తదితర దేశాలతో పాటు జర్మనీ, ఇటలీ వంటి యూరోపియన్ దేశాల్లో కూడా ఈ ప్రక్రియ జోరందుకుంది.
ముందంజలో స్పెయిన్
అన్ని దేశాలతో పోలిస్తే కొవిడ్ వ్యాక్సినేషన్ను పకడ్బందీగా చేస్తూ స్పెయిన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సుమారు 47 కోట్ల స్పెయిన్ జనాభాలో ఇప్పటివరకు 61 శాతం మందికి వ్యాక్సినేషన్ను పూర్తి చేసింది. అత్యధిక మందికి టీకాలు వేసిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశంగానూ స్పెయిన్ నిలిచింది. ఇప్పటివరకూ ఇటలీలో 57.8 శాతం, ఫ్రాన్స్లో 56 శాతం, జర్మనీలో 55.2 శాతం, అమెరికాలో 50.3 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది.
ఎలా సాధ్యమయిందంటే..?
వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం కావాలంటే ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్న జనాభాకు తగ్గట్టు డోసులను కూడా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. వీటన్నింటితోపాటు ముఖ్యంగా ప్రజల్లో నెలకొన్న అనవసరపు అనుమానాలను చెరిపేయాలి. వ్యాక్సిన్ విషయంలో వారికి విశ్వాసం కలిగించేలా అవగాహన కల్పించాలి. అదే తరహాలో స్పెయిన్ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థపై ప్రజల్లో మంచి విశ్వాసాన్ని నెలకొల్పింది. తద్వారా ప్రజలే స్వతహాగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొచ్చారు. అందువల్లే స్పెయిన్లో వ్యాక్సినేషన్ పూర్తయిన వారి శాతం మిగతా దేశాలకంటే ఎక్కువగా ఉంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ తాజా అధ్యయనం ప్రకారం.. స్పెయిన్లో 79 శాతం మంది ప్రజలు కొవిడ్ -19 వ్యాక్సిన్ను విశ్వసించారని తన అధ్యయనంలో పేర్కొంది. అమెరికాలో 62 శాతం, ఫ్రాన్స్లో 56 శాతం, జపాన్లో 47 శాతం మంది మాత్రమే టీకాలను విశ్వసించారని తెలిపింది.
గతానుభవం నేర్పిన పాఠాల నుంచే..
1950 మధ్యలో తీవ్రంగా ప్రభావం చూపిన పోలియో వ్యాధికి అనేక దేశాలు వణికిపోయాయి. దీన్ని అరికట్టడానికి టీకాలు వేయడం ప్రారంభించాయి. కానీ, ఫ్రాంకో నేతృత్వంలోని అధికారులు దాదాపు ఒక దశాబ్దం పాటు టీకాలు వేయకుండా వేచి ఉన్నారు. దీంతో స్పెయిన్లో వేల మంది పిల్లలు పోలియో బారిన పడి వికలాంగులుగా మారారు. అనేక మరణాలు కూడా సంభవించాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి స్పెయిన్ ప్రభుత్వం గట్టి చర్యలే చేపట్టింది. వ్యాక్సిన్పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.