What is VPN: వీపీఎన్ ముసుగు కప్పి... నిఘా నేత్రం కళ్లుగప్పి
వీపీఎన్ (VPN) సేవలను బ్యాన్ చేయాలని హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. అసలేంటీ వీపీఎన్.
వీపీఎన్పై నిషేధానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇటీవల కాలంలో టెకీల నోట తరచూ వినిపిస్తున్న పదం వీపీఎన్ (VPN). ఇప్పుడు భారత్లో అది బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై త్వరలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది. వీపీఎన్ సేవలను బ్యాన్ చేయాలని హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో వీపీఎన్ వినియోగం వల్ల వస్తున్న పలు సాంకేతిక సవాళ్లనూ కమిటీ ప్రస్తావించింది. దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చని నివేదికలో పేర్కొంది. వీపీఎన్ సేవలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి గుర్తింపును దాచడానికి ఉపయోగపడుతున్నాయని తెలిపింది.
ఏమిటీ వీపీఎన్..
వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని అర్థం. ఇది వినియోగదారుడికి పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్షన్లో ప్రైవేటు నెట్వర్క్ను ఏర్పాటు చేస్తుంది. ఇది పూర్తిగా ఎన్క్ర్రిప్టెడ్ విధానంలో ఉండటంతో ఆ సమాచారాన్ని ఇతరులు తెలుసుకొనే అవకాశం లేదు. అలా వీపీఎన్ వినియోగదారుడి ప్రైవసీని కల్పిస్తుంది. సులభంగా చెప్పాలంటే... మీరు మీ ఇంట్లోనే ఉండి ఇంటర్నెట్ను వాడుతూ... ఏ ఆస్ట్రేలియాలో ఉన్నట్లు మీ నెట్వర్క్ను భ్రమింపజేయొచ్చు. తద్వారా మీరు ఎక్కడి నుంచి ఇంటర్నెట్ వాడుతున్నారు, ఏం బ్రౌజ్ చేస్తున్నారనేది ఎవరికీ తెలియకుండా చేయొచ్చు. దీని కోసం చాలా రకాల సాఫ్ట్వేర్లు, యాప్లు అందుబాటులో ఉన్నాయి.
వీపీఎన్ ఎలా పనిచేస్తుంది..?
పబ్లిక్ వైఫై నెట్వర్క్లో ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్ని రహస్యంగా ఉంచడం ద్వారా వీపీఎన్ పని చేస్తుంది. లోకల్ వైఫైల నుంచి డేటా మార్పిడి సమయంలో అది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. దీంతో డేటా ఎక్కడి నుంచి వచ్చిందనే... లొకేషన్ చెప్పడం కష్టం.
దేని కోసం వాడతారు..?
వీపీఎన్ వినియోగదారుడు ఆన్లైన్లో ఉన్న విషయం గోప్యంగా ఉంచుతుంది. ఆన్లైన్లో బదిలీ చేసే డేటా ఎన్క్రిప్ట్ కావడం ఇందులో అతిపెద్ద ప్రయోజనం. ఇంటర్నెట్లో పొంచి ఉన్న హ్యాకర్లను, ముప్పును తప్పించుకొనే అవకాశమూ ఉంది. పబ్లిక్ వైఫైల్లో కూడా మీ ప్రైవసీ దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకొనే వీలుంది.
* సాధారణంగా ఓ వినియోగదారుడు ఆన్లైన్లో బ్రౌజ్ చేసిన అంశాలను ఇంటర్నెట్ ప్రొవైడర్ ఎప్పటికప్పుడు భద్రపరుస్తారు. మన ఐపీ అడ్రస్ను ట్రాక్ చేస్తుంటారు. కానీ, వీపీఎన్ వినియోగిస్తుంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కు ఆన్లైన్ సెర్చ్ కార్యకలాపాలు, హిస్టరీ కనిపించవు. దాంతో ప్రైవసీ వస్తుంది. కానీ అసాంఘిక కార్యకలాపాలు చేస్తే తెలియదు.
* వీపీఎన్ మన సిస్టమ్కు ఒక నకిలీ ఐపీ అడ్రస్ను సృష్టిస్తే.. దాని ఆధారంగా మనం ఇంకో ప్రాంతంలో ఉన్నట్లు ఇంటర్నెట్లో కనిపిస్తుంది. మనం ఉన్న ప్రాంతంలో నిషేధించిన ఇంటర్నెట్ సేవలను కూడా ఆ ఐపీ అడ్రస్ను వినియోగించి వాడుకోవచ్చు. ఉదాహరణకు చైనాలో గూగుల్ను బ్యాన్ చేశారు. కానీ, వీపీఎన్ వాడి అక్కడ కూడా గూగుల్ సేవలను వాడుకోవచ్చు.
* ప్రైవసీ కారణంతో వర్క్ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్ చేసే ఉద్యోగులకు కార్పొరేట్ సంస్థలు వీపీఎన్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నాయి. వారి కార్యకలాపాలను మరొకరు గమనించకుండా జాగ్రత్తపడుతున్నాయి. దీంతో కంపెనీలకు సంబంధించిన కీలక డేటా సురక్షితంగా ఉంటుంది. కరోనా సమయంలో దేశంలో వీపీఎన్ వినియోగం గణనీయంగా పెరిగడం గమనార్హం.
సమస్యలు ఏమిటీ..?
వీపీఎన్తో ఇంటర్నెట్ వినియోగదారులు వ్యక్తిగత అంశాలు గోప్యంగా ఉన్నాయి. కానీ, ఇది సైబర్ క్రిమినల్స్ వినియోగిస్తే... అగంతుకుల కదలికలను గుర్తించలేం. అందుకే కీలక సందర్భాల్లో దర్యాప్తు సంస్థలకు.. వారి కచ్చితమైన ఐపీ అడ్రస్లు గుర్తించడం సమస్యగా మారుతోంది. దీంతో అధికారులు అత్యాధునిక నిఘా పద్ధతులను అనుసరించాల్సి వస్తోంది. పార్లమెంటరీ కమిటీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అందోళన వ్యక్తం చేసింది. దీని ద్వారా ఆన్లైన్లో అసాంఘిక కార్యకలాపాలను గుర్తించలేమని పేర్కొంది.
ఆన్లైన్ పైరసీ కార్యకలాపాలకు ఎక్కువగా దీనిని వాడుతున్నారు. డార్క్ వెబ్లో కార్యకలాపాలు కూడా వీపీఎన్ మార్గంలోనే జరుగుతున్నాయి. అక్కడ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, ఇతర అవాంఛిత సేవలు అందుబాటులో ఉంటాయన్న విషయం తెలిసిందే.
చైనాలో వీపీఎన్ సేవలు కష్టమే..
చైనా కొన్నేళ్లుగా వీపీఎన్ సేవలను కట్టడి చేస్తూ వస్తోంది. ఆ దేశంలోని గ్రేట్ ఫైర్వాల్ ఇంటర్నెట్ సెన్సార్షిప్ను పలుమార్లు అప్డేట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో దేశం నుంచి వీపీఎన్ మార్గంలో సమాచారం లీకవుతోందని అనుమానించి ఈ చర్యలు తీసుకొంది.
కమిటీ సూచనలు ఏమిటీ..
హోం శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లతో కలిసి పనిచేయాలని పేర్కొంది. దీంతోపాటు వీపీఎన్ బ్యాన్ విషయంలో అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని చెప్పింది. ఇందుకు అవసరమైన వ్యస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
ఇంటర్నెట్ స్వేచ్ఛకు భంగమేనా..
వీపీఎన్పై నిషేధాన్ని వ్యతిరేకించే వారూ ఉన్నారు. నెట్ న్యూట్రాలిటీ, వ్యక్తిగత గోప్యతకు ఈ నిషేధం గండి కొడుతుందని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ పాలసీ కౌన్సిల్కు చెందిన రోహిణ్ గార్గ్ అంటున్నారు. భారత ఇంటర్నెట్ వ్యవస్థలో వీపీఎన్ విడదీయలేని భాగమని పేర్కొన్నారు.గంపగుత్తగా వీపీఎన్పై నిషేధం తగదన్నారు.
బ్యాన్ ప్రయోజనం ఉంటుందా..?
చైనాలో ఇప్పటికే వీపీఎన్ను బ్యాన్ చేశారు. కానీ, అక్కడ అక్కడ ఆ నిషేధం సమర్థంగా అమలు కావడంలేదు. అందుకే ఇప్పటికీ ప్రపంచంలోని టాప్ 10 వీపీఎన్ వినియోగ మార్కెట్లలో చైనా స్థానం దక్కించుకొంది. ఆన్లైన్లో నిషేధిత కంటెంట్ను చూడకుండా, వినియోగించకుండా చేయడానికి వీపీఎన్పై నిషేధం ఒక్కటే మార్గం కాదు. సాంకేతికత రెండు వైపుల పదున్న కత్తిలాంటింది. ముఖకవళికల గుర్తింపు టెక్నాలజీతో క్రిమినల్స్, తప్పిపోయిన వారిని కనుగొనొచ్చు. అదే సమయంలో ప్రభుత్వాలు తమ ప్రత్యర్థులపై నిఘా కూడా పెట్టవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్ నేపథ్యంతో నటుడు విజయ్ కుమారుడి సినిమా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
-
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
-
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం