Mission Olympics: సరిహద్దుల్లోనే కాదు.. ఒలింపిక్స్లోనూ భారత్ను గెలిపిస్తున్న సైన్యం!
వందేళ్ల నిరీక్షణకు తెరదించుతూ అథ్లెటిక్స్కు స్వర్ణం సాధించిన మన బంగారం నీరజ్ చోప్రా అథ్లెట్ మాత్రమే కాదు. భారత సైన్యం స్ఫూర్తి కూడా అతడిలో ఉంది....
ఇంటర్నెట్ డెస్క్: వందేళ్ల నిరీక్షణకు తెరదించుతూ అథ్లెటిక్స్లో స్వర్ణం సాధించిన మన బంగారం నీరజ్ చోప్రా అథ్లెట్ మాత్రమే కాదు.. భారత సైన్యం స్ఫూర్తి కూడా అతడిలో ఉంది. అతడు సైన్యంలో నాలుగో రాజ్పుతానా రైఫిల్స్ బృందంలో నాయిబ్ సుబేదార్గా పని చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో నీరజ్ ప్రతిభను గుర్తించిన భారత ఆర్మీ 2016లో అతడిని జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా నియమించింది. సాధారణంగా క్రీడాకారులను నాన్ కమిషన్డ్ ర్యాంకు ఉద్యోగాలకు తీసుకుంటారు. కానీ నీరజ్పై ఎంతో నమ్మకముంచిన సైన్యం అతడికి ఆరంభంలోనే మంచి ఉద్యోగం ఇచ్చింది. సైన్యంలో చేరిన తర్వాత ట్రైనింగ్ సజావుగా సాగడానికి సాయం చేసింది.
ఏంటీ మిషన్ ఒలింపిక్స్..
నీరజ్ లాంటి ఆణిముత్యాల్ని గుర్తించి అంతర్జాతీయ స్థాయి శిక్షణనిచ్చేందుకు సైన్యం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అదే మిషన్ ఒలింపిక్స్. 2001లో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం.. నీరజ్ రూపంలో సత్ఫలితాన్ని తెచ్చి పెట్టింది. ఒలింపిక్ పతకాలు సాధించగల సత్తా ఉన్న క్రీడాకారులను గుర్తించి సరైన శిక్షణ అందించడమే ఈ మిషన్ ఒలింపిక్స్ ప్రధాన లక్ష్యం.
ఎలాంటి శిక్షణనిస్తారు?
ఈ మిషన్లో భాగంగా అర్హతగల ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తారు. శాస్త్రీయ పద్ధతుల్లో.. ప్రపంచంలోనే ఉత్తమ కోచ్లతో శిక్షణనిప్పిస్తారు. నిరంతరం వారి ఆటతీరును పర్యవేక్షిస్తూ కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందిస్తారు.
ఏయే క్రీడాంశాల్లో..
మిషన్ ఒలింపిక్స్లో భాగంగా భారత్కు పతకాలు వచ్చే అవకాశం ఉన్న 10 క్రీడాంశాల్ని గుర్తించారు. ఇందులో అథ్లెటిక్స్, డైవింగ్, ఆర్చరీ, వెయిల్లిఫ్టింగ్, బాక్సింగ్, రోయింగ్, సెయిలింగ్, రెజ్లింగ్, ఈక్వెస్ట్రియాన్, షూటింగ్ ఉన్నాయి.
ఎక్కడెక్కడ కేంద్రాలున్నాయి..
మిషన్లో భాగంగా ఆటగాళ్లకు శిక్షణనిచ్చేందుకు ఆయా ప్రాంతాల్లో పలు క్రీడలకు చెందిన మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, ఇండోర్ స్టేడియాలు అభివృద్ధి చేశారు. పుణెలో దాదాపు 200 మంది ఆటగాళ్లకు ఒలింపిక్ స్థాయి శిక్షణనిచ్చేలా ఓ భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నెలకొల్పారు. మేరఠ్లో 200 ఎకరాల్లో ఈక్వెస్ట్రియాన్ మైదానం ఉంది. ముంబయిలోని ఆర్మీ యాచింగ్ నోడ్లో సెయింగ్లో శిక్షణనిస్తున్నారు. పుణెలో వెయిట్లిఫ్టర్లకు అత్యాధునిక శిక్షణా ఏర్పాట్లు ఉన్నాయి. ఇదే నగరంలో ఉన్న ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, డైవింగ్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, ఫెన్సింగ్లో శిక్షణనిస్తున్నారు.
వీళ్లంతా మిషన్ ఒలింపియన్లే..
టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన అమిత్ పంగల్(బాక్సింగ్), మనీశ్ కౌశిక్(బాక్సింగ్), సతీశ్ కుమార్(బాక్సింగ్), అవినాశ్ సబ్లే(అథ్లెటిక్స్) కూడా మిషన్ ఒలింపిక్స్లో భాగంగా శిక్షణ పొందినవారే. రోయింగ్లో తొలిసారి సెమీ ఫైనల్కు చేరిన అర్జున్ లాల్, అర్వింద్ సింగ్ కూడా ఆర్మీకి చెందినవారే. వీరితో పాటు గతంలో కామన్వెల్త్, ఆసియా, దక్షిణాసియా సహా ప్రపంచ స్థాయి పోటీల్లో భారత్కు పతకాలు తెచ్చిన అనేక మంది మిషన్ ఒలింపిక్స్లో శిక్షణ తీసుకున్నారు.
ఓవైపు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే.. మరోవైపు ఒలింపిక్స్ వంటి విశ్వక్రీడల్లో పతకాలతో భారత పతాకాన్ని ఎగురవేసేందుకు సైన్యం కృషి చేస్తోంది. చిన్న వయసులోనే సత్తా ఉన్న ఆటగాళ్లను గుర్తించి వారిని ఆర్మీలోకి తీసుకుంటోంది. జూనియర్, సబ్-జూనియర్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేలా హవల్దార్ స్థాయి ఉద్యోగాన్ని కట్టబెడుతోంది. పతకాల వేటలో భారత్ చేస్తున్న కృషికి దన్నుగా నిలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ