fatf: ఎఫ్ఏటీఎఫ్ కొరడా.. పాక్, టర్కీ కుతకుత..
అక్టోబర్లో ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే ఆ సంస్థ గ్రేలిస్టులో ఉన్న పాక్కు తోడుగా టర్కీని కూడా చేర్చింది.
భారీగా పతనం అవుతున్న ఆర్థిక వ్యవస్థలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అక్టోబర్లో ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే ఆ సంస్థ గ్రేలిస్టులో పాక్ కొనసాగుతుండగా.. కొత్తగా టర్కీని కూడా దానిలో చేర్చింది. దీంతో టర్కీ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయే పరిస్థితి నెలకొంది. అసలు ఈ ఆర్థిక చర్యల కార్యదళం అంటే ఏమిటీ..? దీని ప్రభావం పాక్, టర్కీలపై ఏ రకంగా పడుతుందంటే..
అసలు ఎఫ్ఏటీఎఫ్ అంటే ఏమిటీ..?
అక్రమ మార్గాల్లో ప్రవహించే నగదు చీకటి కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి ఊతం ఇస్తాయి. చాలా వెనుకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చేవిధంగా ఉంటాయి. ఇటువంటి పనులను నిరోధించడానికి ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం కాదు. పారిస్ కేంద్రంగా జీ-7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీనిని ప్రారంభించాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా కొన్ని నిబంధనలను ఇవి ప్రవేశపెట్టాయి. జీ7 దేశాలు సంపన్నమైనవి కావడంతో ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయడం ఎఫ్ఏటీఎఫ్ విధి.
2006లో భారత్ ప్రవేశం..
2006లో భారత్కు ఎఫ్ఏటీఎఫ్ అబ్జర్వర్ హోదా ఇచ్చింది. ఆ తర్వాత దీనిలో పూర్తి సభ్యత్వం కోసం కృషి చేసింది. ఫలితంగా 2010 జూన్ 25 తేదీన 34వ సభ్య దేశంగా చేరింది. ప్రస్తుతం 39 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిల్లో ఐరోపా సమాఖ్య, జీసీసీ కూడా సభ్యులే.
9/11 దాడుల తర్వాత మరింత కఠినంగా..
అమెరికాలో జంట భవనాలపై ఉగ్రదాడుల తర్వాత ఎఫ్ఏటీఎఫ్ మరిన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ సంఘం 2001 అక్టోబర్లో వాషింగ్టన్ డీసీలో భేటీ అయింది. ఉగ్రవాద నిరోధాన్ని లక్ష్యంగా మార్చుకొంది. మరోపక్క అదే సమయంలో ఐరాస భద్రతా మండలిలో యూఎన్ఎస్సీ 1373 తీర్మానాన్ని ఆమోదించారు. దీనిని 1999లో అల్ఖైదా ఉగ్రవాదులపై చేసిన 1267 తీర్మానానికి జోడించారు. ఆ తర్వాత నుంచి అల్ఖైదా, తాలిబన్లతో సంబంధాలున్న డజన్ల కొద్దీ సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ఉగ్రనిధులకు అడ్డుకట్టే ఎఫ్ఏటీఎఫ్కు ప్రధాన విధిగా మారింది. 2018 నుంచి ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్టులో పాకిస్థాన్ ఉంది. అయినా ఆ దేశం తీరులో ఏమాత్రం మార్పు రాలేదు.
ఫ్రాన్స్పై పాక్కు అనుమానం..
ఎఫ్ఏటీఎఫ్ అక్టోబర్ సమావేశంలో కూడా పాక్కు గ్రే లిస్టు నుంచి మోక్షం లభించకపోవడంపై ఇమ్రాన్ ఖాన్ సర్కారు తీవ్ర అసహనంతో ఉంది. పాకిస్థాన్లో జరుగుతున్న ఫ్రాన్స్ వ్యతిరేక నిరసనలు ఈ రకంగా ప్రతికూల ప్రభావం చూపాయని భావిస్తోంది. ఫ్రాన్స్ చొరవతోనే గ్రేలిస్టులో ఉండిపోయినట్లు అనుమానిస్తోంది. దీనికి తోడు ఇన్నాళ్లూ పాక్కు అండగా నిలిచిన టర్కీని కూడా ఈ జాబితాలో చేర్చడం మరో ఎదురుదెబ్బ. దీంతో పాక్కు బ్లాక్లిస్టులోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఆదివారం ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్కస్ ప్లయర్ స్పందించారు. ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయాలు సమష్టిగా ఉంటాయని తెలిపారు. సంస్థలోని 39 సభ్యదేశాల నిర్ణయాల ఆధారంగా ఇది ఉంటుందని పేర్కొన్నారు.
గ్రేలిస్ట్ ప్రభావం ఇదీ..
ఎఫ్ఏటీఎఫ్ అనుమానాస్పద దేశాల జాబితా (గ్రే లిస్టు)లో ఉండటం ఇస్లామాబాద్కు కొత్తేమీ కాదు. 2008లో, 2012-15 మధ్యకాలంలోనూ పాక్ ఆ జాబితాలో ఉంది. ఆయా సందర్భాల్లో ఆర్థికంగా కుదేలైపోయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 2018లో మరోమారు ఈ జాబితాలో చేరడంతో ఏడాదిలో దాదాపు వెయ్యి కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లిందని 2019లో ఆ దేశ విదేశాంగశాఖ మంత్రిగా ఉన్న షా మహమ్మద్ ఖురేషీ వెల్లడించారు. నిషేధిత జాబితా (బ్లాక్ లిస్ట్)లో ప్రవేశిస్తే పాకిస్థాన్కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) సంస్థ నుంచి వచ్చే రుణాలూ కష్టతరం కానున్నాయి.
పాక్కు తోడుగా టర్కీ..
మొత్తం 8 కారణాలను చెప్పి టర్కీని కూడా ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్టులో చేర్చింది. మనీ లాండరింగ్పై నిరోధక చర్యల్లో లోపాలు, ఐరాస ఆంక్షల అమలుకు సహకరించకపోవడం, ప్రభుత్వేతర సంస్థల ద్వారా ఉగ్ర వాదానికి నిధుల మళ్లింపు వంటి తీవ్ర ఆరోపణలు దీనిలో ఉన్నాయి. టర్కీకి నయా అటమాన్ సామ్రాజ్య కళను తెచ్చేందుకు అధ్యక్షుడు ఎర్డగాన్ చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆధిపత్యం కోసం టర్కీ పలు దేశాలతో తగాదాలు పెట్టుకొంది. ఇస్లాం ప్రపంచంలోని యుఏఈ-సౌదీ జోడీని సవాలు చేసేందుకు యత్నించింది. నాటోలో సభ్య దేశంమైనా.. పలు అంశాల్లో అమెరికాతో కయ్యానికి కాలు దువ్వింది. ఇక రష్యాకు వ్యతిరేకంగా సిరియాలో పనిచేసింది. పొరుగునున్న గ్రీస్ సమీపంలోకి చమురు డ్రిల్లింగ్ నౌకలు పంపి భయపెట్టే యత్నాలు చేసింది.
భారీ మూల్యం చెల్లిస్తూ..
మే నెలలో ఐఎంఎఫ్ పరిశోధన ప్రకారం టర్కీ కనుక ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్టులో చేరితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. హాట్మనీగా పిలిచే స్వల్పకాల పెట్టుబడుల్లో 3శాతం తగ్గి, ప్రత్యక్ష పెట్టుబడుల్లో 3శాతం కోల్పోయినా భారీ మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. జీడీపీలో మూడు శాతం అంటే 23 బిలియన్ డాలర్లకు సమానం. టర్కీ 2020 వార్షిక రక్షణ రంగ బడ్జెట్ 17 బిలియన్ డాలర్లకు సమానం. ఆ లెక్కన 23 బిలియన్ డాలర్లంటే టర్కీకి ఎంత పెద్దమొత్తమో అర్థం చేసుకోవచ్చు. 2007లోని విదేశీ పెట్టుబడులు 19 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2020లో టర్కీకి వచ్చినవి 5.7 బిలియన్ డాలర్లు మాత్రమే . అంటే ఇప్పటికే కష్టాల్లో ఉన్న టర్కీకి ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం శరాఘాతమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!