Hanoi: ఆ నగరం మొత్తానికి కొవిడ్ పరీక్షలు
వియత్నాం ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద పట్టణమైన హనోయ్లో ప్రజలందరికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్డెస్క్: వియత్నాం ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద పట్టణమైన హనోయ్లో ప్రజలందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దేశంలో సరికొత్త వేరియంట్ వెలుగు చూడటంతో వియత్నాం అప్రమత్తమైంది. కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇక హుచిమిన్ నగరంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రకటించింది. 10 మందికి మించి గుమిగూడటాన్ని రెండు వారాలపాటు నిషేధించింది. వియత్నాంలో గత గురువారం నుంచి చాలా వరకూ వ్యాపారాలను మూసివేశారు. స్థానిక చర్చిలో వైరస్ వ్యాపించేలా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఒక జంటపై కేసు నమోదు చేశారు. దాదాపు 145 కేసులకు చర్చితో సంబంధాలు ఉండటంతో లాక్డౌన్ చేశారు. వియత్నాంలో మత సంబంధమైన అన్ని రకాల కార్యక్రమాలపై నిషేధం ఉంది.
హనోయ్ నగర పాలక అధికారులు రోజు లక్ష నమూనాలు చొప్పున ప్రజలందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ‘వియత్నమ్ న్యూస్’ సంస్థ పేర్కొంది. వియత్నాంలో ఏప్రిల్ నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక్కడ మొత్తం 31 మున్సిపాలిటీలు, ప్రావిన్స్లో కలిపి 4,000 పైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తి మొదటి దశలో నమోదైన కేసులతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు ఉంది.
భారత్, బ్రిటన్లలో కనిపించిన కరోనా వైరస్ సంకర రకం వియత్నాంను హడలెత్తిస్తోంది. సగానికి పైగా భూభాగంలో సంకర రకం వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇది గాలిలో క్షణాల్లో వ్యాపిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి న్యుయెన్ థాన్ లాంగ్ శనివారం చెప్పారు. వియత్నాంలో తొలి విడతలోనే ఏడు రకాలైన కరోనా వైరస్ వ్యాప్తి చెందినా ఉద్ధృతికి చాలావరకూ కళ్లెం వేసి ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిర్దిష్టంగా వీటి సంఖ్య ఎంత అనేది ప్రభుత్వం వెల్లడించలేదు. భారత్, బ్రిటన్లలో కనిపిస్తున్న రకాల హైబ్రిడ్ వేరియంట్ ప్రస్తుతం ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్కు కళ్లెం వేయడంలో భాగంగా లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించారు.
కరోనా వైరస్ శరీరంలో పునరుత్పత్తి అవుతున్న సమయంలో జరిగే స్వల్ప జన్యుమార్పుల కారణంగా కొత్త రకాలు పుట్టుకొస్తాయి. ఇవన్నీ 2019లో చైనాలో కనిపించిన వైరస్ను పోలి ఉన్నా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని నాలుగు ఆందోళనకర వేరియంట్లుగా గుర్తించింది. వియత్నాం ఇప్పటి వరకు 10లక్షల మందికి ఆస్ట్రాజెనికా టీకాలను వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఫైజర్ నుంచి మరో 30 లక్షల టీకాలు రానున్నాయి. మిగిలిన వారికి టీకాల కోసం మోడెర్నాతో ఇప్పటికే చర్చలు జరుపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)