UK: కొవిషీల్డ్ ఓకే కానీ.. టీకా సర్టిఫికేట్కు కనీస ప్రమాణాలుండాలి..!
భారత్లో తయారుచేసిన కొవిషీల్డ్ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని, వ్యాక్సిన్ సర్టిఫికేట్తోనే సమస్య ఉందని చెబుతోన్న బ్రిటన్ ప్రభుత్వం.. తాజాగా టీకా ధ్రువీకరణ
యూకే ప్రభుత్వం స్పష్టం
లండన్: భారత్లో తయారుచేసిన కొవిషీల్డ్ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని, వ్యాక్సిన్ సర్టిఫికేట్తోనే సమస్య ఉందని చెబుతోన్న బ్రిటన్ ప్రభుత్వం.. తాజాగా టీకా ధ్రువీకరణ పత్రాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దేశాలు జారీ టీకా ధ్రువీకరణ పత్రాలకు కనీస ప్రమాణాలుండాలని యూకే ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఇక, తమ అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలపై దశల వారీ విధానంలో భారత్తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్ను బ్రిటన్ అంతర్జాతీయ పర్యాటక అడ్వైజరీ ఆమోదిత సూత్రీకరణల జాబితాలో చేర్చుతున్నట్లుగా బ్రిటన్ బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సవరణ అడ్వైజరీ జారీచేసింది. అయితే, ఆమోదించిన టీకాలకు సంబంధించి 18 దేశాలతో రూపొందించిన జాబితాలో మాత్రం భారత్ను ఇప్పటికీ చేర్చలేదు. దీని వల్ల భారతీయులు టీకాలు తీసుకున్నప్పటికీ బ్రిటన్ వెళ్లిన తర్వాత 10 రోజులు క్వారంటైన్లో ఉండాలి.
ఈ సవరణ అడ్వైజరీపై ఇంకా గందరగోళం తొలగకపోవడంతో యూకే ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ‘‘ప్రజా ఆరోగ్యమే మాకు ముఖ్యం. అందుకే అత్యంత భద్రతతో అంతర్జాతీయ ప్రయాణాలను పునఃప్రారంభించాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. దేశాలు జారీ చేసే టీకా సర్టిఫికేట్లు కనీస ప్రమాణాలు కలిగి ఉండాలి. అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలపై భారత్ సహా అంతర్జాతీయ భాగస్వాములతో దశల వారీ విధానంలో కలిసి పనిచేస్తున్నాం’’ అని పేర్కొంది. అయితే భారత్ సహా ఇతర దేశాల టీకా ధ్రువీకరణ పత్రాలను ఆమోదించేందుకు బ్రిటన్ రూపొందించిన కనీస ప్రమాణాలేంటో మాత్రం ఆ దేశ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు.
కొవిన్ యాప్ డెవలపర్లతో చర్చలు..
ఇదిలా ఉండగా.. టీకా సర్టిఫికేట్ల పై కొవిడ్ యాప్, ఎన్హెచ్ఎస్ యాప్ రూపకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు బ్రిటన్కు బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ వెల్లడించారు. ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. అతిత్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్