China Vs Taiwan: తైవాన్ను డ్రాగన్ ముట్టకుండా తెరపైకి ‘పాయిజన్ ఫ్రాగ్’
చిక్కటి అడవుల్లో ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే విషపూరిత కప్పను ఏ పాము అయినా నోట పట్టిందా.. ఆ రోజుతో పాముకు భూమిపై నూకలు చెల్లిపోతాయి..
ఆ దేశ ద్వీపాలను రక్షించడానికి అమెరికా వ్యూహ సంస్థల కసరత్తు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చిక్కటి అడవుల్లో ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే విషపూరిత కప్పను ఏ పాము అయినా నోట పట్టిందా.. ఆ రోజుతో పాముకు భూమిపై నూకలు చెల్లిపోతాయి. అచ్చం ఇలానే తైవాన్ను అత్యంత దుర్భేద్యంగా మార్చేయాలని అమెరికా వ్యూహ రచన చేస్తోంది. ఇటీవల జో బైడెన్ మాట్లాడుతూ తైవాన్ రక్షణకు తాము జోక్యం చేసుకొంటామని నోరుజారారు. వాస్తవానికి అమెరికా పాలసీకి ఇది విరుద్ధం. అమెరికా వైఖరి బహిర్గతమైతే చైనా అప్రమత్తమై మరిన్ని జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంది. అప్పుడు తైవాన్ను రక్షించడం మరింత కష్టమైపోతుంది. అందుకే వెంటనే శ్వేతసౌధం ప్రతినిధి జెన్సాకి మళ్లీ ప్రెస్మీట్ ఏర్పాటు చేసి ‘వన్ చైనా పాలసీ’కి కట్టుబడే విషయంలో తమ వైఖరి మారలేదని పేర్కొన్నారు. తైవాన్ రక్షణ విషయంలో అమెరికాకు అతితక్కువ అవకాశాలు ఉన్నట్లు ఇటీవల తేలింది. దీంతో చైనా ఏ మాత్రం దుస్సాహసం చేసినా.. ఆ తర్వాత పరిణమాలను భరించలేక వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి తీసుకురావాలని అమెరికా వ్యూహకర్తలు చెబుతున్నారు. ఇందుకోసం వారు ‘ది పాయిజన్ ఫ్రాగ్’ వ్యూహం ఉత్తమమని సూచిస్తున్నారు.
డాంగ్షా ద్వీపంపై చైనా కన్ను
ఇటీవల తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి చైనా యుద్ధవిమానాలు పదుల సంఖ్యలో చొరబడుతున్నాయి. చైనా తొలుత డాంగ్షా ద్వీపం, ప్రాతాస్ ద్వీపాన్ని ఆక్రమించాలని కుయుక్తులు పన్నుతోంది. ఈ రెండు ద్వీపాలు తైవాన్లో భాగం. వీటిల్లో తొలిదాడి డాంగ్షాపై జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కేవలం 500 మంది తైవాన్ భద్రతా సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. చైనా అధీనంలోని హాంకాంగ్ నుంచి ఇది 190 మైళ్ల దూరంలో ఉండగా.. తైవాన్కు 275 మైళ్ల దూరంలో ఉంది.
ఇటీవల చైనా ఒక దీవిని ఆక్రమించేందుకు వీలుగా సైనికులతో సాధన చేయిస్తున్న విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏ దాడి నుంచి అయినా తైవాన్ను రక్షించేందుకు వీలుగా సమీపంలో అమెరికాకు చెందిన యుద్ధనౌకలు, సబ్మెరైన్లు తగినన్ని లేవు. తైవాన్ చిన్న దేశం కావడం.. పెద్ద దేశాల నుంచి దానికి గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో తైవాన్ రక్షణ అమెరికాకు కష్టం కానుంది. ఈ విషయం ఇటీవల వాషింగ్టన్లోని సీఎన్ఏస్ (సెంటర్ ఫర్ న్యూ అమెరికా సెక్యూరిటీ) సంస్థ ‘వార్గేమింగ్ ల్యాబ్’లో చేసిన ప్రయోగాల్లో ఊహించని లోపాలు బయటపడ్డాయి. తైవాన్ను రక్షించే క్రమంలో అమెరికాకు చాలా సమస్యలు తలెత్తనున్నట్లు తేలింది. తైవాన్-అమెరికా సైన్యాల మధ్య కమ్యూనికేషన్లు కూడా సక్రమంగా ఉండే అవకాశం లేదని తెలిసింది. అమెరికాకు చాలా పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉన్నట్లు ఈ వార్గేమ్స్లో బయటపడింది.
తెరపైకి కొత్త వ్యూహం..
డాంగ్షా ద్వీపంలో చదునైన భూభాగం ఉండటంతో ఆక్రమణల నుంచి రక్షించడం కష్టం. డాంగ్షా ద్వీపాన్ని ఆక్రమిస్తే ప్రాదేశిక జలాలు, ఎక్స్క్ల్యూజివ్ ఎకనమిక్ జోన్లతో దక్షిణ చైనా సముద్రంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నావికాదళం పట్టు బిగుస్తుంది. తైవాన్ రక్షణకు వచ్చే దేశాల నౌకలను అడ్డుకోవడం తేలిగ్గా మారుతుంది. ఫలితంగా తైవాన్ ఆక్రమణ సులువు అవుతుంది. గతేడాది చైనా డ్రోన్లు తరచూ ఈ ద్వీపం వద్దకు రావడంతో.. వాటిని కూల్చేస్తామని తైవాన్ హెచ్చరికలు కూడా జారీ చేసింది.
ఈ నేపథ్యంలో డాంగ్షా, ప్రతాస్ వంటి చిన్న ద్వీపాలను వీలైనంత దుర్లభంగా మార్చేసి రక్షించాలని అమెరికా భావిస్తోంది. సెంటర్ ఫర్ న్యూ అమెరికా సెక్యూరిటీ వ్యూహాకర్తలు అభిప్రాయం ప్రకారం.. డ్రాగన్ మింగటానికి వీలుకాని ‘విషపూరిత కప్ప’వలే తైవాన్ ద్వీపాలను మార్చాలని సూచించారు. ఇప్పటికే అమెరికా సైనికులు రహస్యంగా తైవాన్లో భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వడం ఈ వ్యూహానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు సైనికపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైనా భరించలేనంత మూల్యం చెల్లించేలా సిద్ధం చేయాలని వ్యూహకర్తలు సూచించారు. వీటిల్లో చైనాపై ఆర్థిక, రాజకీయ ఆంక్షలు విధించడం వంటివి కూడా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.