యూఎస్‌ క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ తాత్కాలిక మూసివేత!

యూఎస్‌ క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ను సోమవారం తాత్కాలికంగా మూసివేశారు. కాంప్లెక్స్‌ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు క్యాపిటల్‌ పోలీసులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చే

Published : 19 Jan 2021 00:10 IST

వాషింగ్టన్‌: యూఎస్‌ క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ను సోమవారం తాత్కాలికంగా మూసివేశారు. ఈ కాంప్లెక్స్‌ సమీపంలో అగ్నిప్రమాదం జరగడంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం ట్విటర్‌లో స్పందించింది. ‘జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ మూసివేయాలని నిర్ణయించాం. ప్రజలకు ఎలాంటి ముప్పు లేదు’ అని వెల్లడించింది. యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై జనవరి 6న ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బైడెన్‌ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో భద్రతా ముప్పు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో భారీగా బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఇదీ చదవండి

పటిష్ఠ పహారాలో అమెరికా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని