F35: రష్యన్లు రంగంలోకి దిగారేమో.. ఎఫ్35పై అమెరికాలో గుబులు..!
ఒక ఆయుధ రహస్యాలను కాపాడేందుకే అమెరికా నాటో కూటమిలోని సభ్యదేశమైన టర్కీతో విరోధం పెట్టుకొంది. భవిష్యత్తులో ఆ రహస్యాలు
శకలాలను గుర్తించినా.. వెంటనే వెలికి తీయలేని పరిస్థితి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఒక ఆయుధం రహస్యాలను కాపాడేందుకే అమెరికా నాటో కూటమిలోని సభ్యదేశమైన టర్కీతో విరోధం పెట్టుకొంది. భవిష్యత్తులో ఆ రహస్యాలు రష్యా చేతికి దక్కకూడదనే అలా చేసింది..! ఆ ఆయుధమే ఎఫ్-35 యుద్ధవిమానం. ఈ యుద్ధవిమానం తయారీకి ప్రపంచంలో ఏ ప్రాజెక్టుపై చేయనంతగా దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్లను అమెరికా ఖర్చుచేసింది. అంటే 20 ఏళ్లపాటు అఫ్గానిస్థాన్ యుద్ధంపై వెచ్చించిన దాదాపు ట్రిలియన్ డాలర్ల కంటే మరో 50శాతం ఎక్కువన్నమాట. తాజాగా ఎఫ్-35 టెక్నాలజీ భద్రత మరోసారి ప్రమాదంలో పడటంతో అమెరికాకు కంటిమీద కునుకు కరవైంది.
ఇంజిన్ కవర్ ఎంత పనిచేసిందో..?
నవంబర్లో బ్రిటన్కు చెందిన ‘క్వీన్ ఎలిజిబెత్’ విమాన వాహక నౌక పై నుంచి ఎఫ్-35బీ విమానం మధ్యదరా సముద్రంలో కూలిపోయినట్లు రాయల్ నేవీ ప్రకటించింది. ఈ ప్రమాదం నుంచి బ్రిటన్కు చెందిన ‘డ్యామ్ బస్టర్స్’ స్క్వాడ్రన్ పైలట్ సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది. ఎఫ్35 విమాన ఎజెక్షన్ సీట్లను తయారు చేసిన మార్టిన్ బేకర్ సంస్థ కూడా లోపాయకారీగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ కూలిపోయిన ఎఫ్35బీ వేరియంట్ విమానంలో చాలా ప్రత్యేకమైన టెక్నాలజీని వాడారు. దీని ఖరీదు 100 మిలియన్ డాలర్లకు పైమాటే. ఇది హెలికాప్టర్ వలే నిట్టనిలువునా ఎగరగలదు.. ల్యాండ్ అవ్వగలదు. వర్షాల నుంచి రక్షణగా ఈ విమానంపై అమర్చిన కవర్ను ఇంజిన్ లోపలికి లాక్కోవడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అయ్యింది.
ప్రమాదం చోటుచేసుకోగానే బ్రిటన్ ఆగమేఘాల మీద విమాన శకలాల కోసం గాలింపు మొదలు పెట్టింది. బాగా బరువుండే విమాన శకలాలు సముద్రం అడుగుకు చేరతాయి. కానీ, సముద్ర జలాల లోతుల్లోకి వెళ్లడానికి మనుషులు, యంత్రాలకు పరిమితులు ఉన్నాయి. దీంతో ఈ శకలాలను కనుగొని వెలికితీసేంత టెక్నాలజీ బ్రిటన్ వద్ద లేకపోవడంతో అమెరికా, మిత్రదేశాల సాయం కోరింది.
రష్యన్లను తక్కువ అంచనావేయలేని పరిస్థితి..
దాదాపు రెండు వారాలకు పైగా కంటిమీద కునుకులేకుండా గాలించగా.. చివరికి ఆ శకలాలు ఉన్న ప్రదేశాన్నినిన్న గుర్తించారు. కానీ, వెంటనే వెలికి తీసే అవకాశం లేదు. ఈ లోపు రష్యన్లు ఎక్కడ రంగంలోకి దిగి ఆ శిథిలాలను అపహరిస్తారేమోనని అమెరికా ఆందోళన చెందుతోంది. ఎందుకంటే కోల్డ్వార్ సమయంలో అమెరికా, రష్యాలు సముద్ర గర్భంలో రికవరీ ఆపరేషన్లు చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. బాహ్య ప్రపంచానికి మాత్రం జలాంతర్గాములకు సాయం చేసే పరికరాలుగా చెప్పుకొంటూ ఇరుదేశాలు పలు కోవర్టు ఆపరేషన్లు నిర్వహించాయి.
1966లో థర్మోన్యూక్లియర్ బాంబు కోసం వేటతో మొదలై..
1966లో అమెరికాకు చెందిన బీ-52 బాంబరు విమానం నాలుగు థర్మోన్యూక్లియర్ బాంబులతో ప్రయాణిస్తూ.. గాల్లో ఇంధనం నింపుకొనే క్రమంలో ట్యాంకర్ విమానాన్ని ఢీకొని స్పెయిన్ సమీపంలోని పాలోమరెస్ వద్ద కూలిపోయింది. మూడు అణు బాంబులు సమీపంలోని మత్సకారుల గ్రామం వద్ద పడి కొంత రేడియేషన్ వెదజల్లాయి. ఒకటి మాత్రం సముద్రంలో 2,500 అడుగుల లోతున పడిపోయింది. దీనిని వెలికి తీసేందుకు సరైన పరికరాలు లేక అమెరికా రెండున్నర నెలలు తిప్పలు పడాల్సి వచ్చింది. దీంతో సముద్రం అడుగు నుంచి కూడా శకలాలను సేకరించేలా యూఎస్ఎస్ హాలిబట్ అనే సబ్మెరైన్లో మార్పులు చేశారు. దీనిని రష్యా క్షిపణి టెక్నాలజీపై నిఘాకు వినియోగించారు. క్షిపణి ప్రయోగం తర్వాత శకలాలను సేకరించేందుకు దీనిని వాడుతొన్నట్లు బాహ్యప్రపంచానికి చెప్పింది. కానీ, పెట్రోపావ్లోవ్స్క్లోని రష్యా పసిఫిక్ కమాండ్ నుంచి వ్లాదీవాస్తోక్ నగరంలోని నావికాదళ కేంద్రానికి వెళ్లే కేబుళ్లకు అమెరికన్లు నిఘా పరికరాలను అమర్చారు. ఈ సమయంలోనే రష్యా టార్పిడోల గమనానికి రాడార్లు వాడుతున్నట్లు గుర్తించింది.
చమురు అన్వేషణ ముసుగులో..
రష్యా సబ్మెరైన్ కె-129 మునిగిపోవడంతో దాని టెక్నాలజీని సొంతం చేసుకోవడానికి అమెరికా 1971లో ‘ప్రాజెక్టు అజోరియన్’ చేపట్టింది. ఓ బిలియనీరు నిర్మించిన చమురు అన్వేషణ కేంద్రం ముసుగులో రష్యా సబ్మెరైన్ శకలాలపై ఒక నిర్మాణం చేపట్టింది. కె-129 కోడ్ రూమ్తో సహా చాలా కీలక పరికరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ దక్కించుకొంది.
ఎన్ఆర్-1 పేరుతో అణుశక్తితో నడిచే ప్రత్యేకమైన మినీ జలాంతర్గామిని అమెరికా అభివృద్ధి చేసింది. ఇది సముద్రం అడుగుకు చేరి శకలాలను వెలికి తీయగలదు. ‘ఛాలెంజర్ స్పేస్ షటిల్’ విడిభాగాలను ఇదే వెలికి తీసింది.
మరోపక్క రష్యా కూడా ‘లోషారిక్’ పేరిట సముద్రపులోతుల్లో కార్యకలాపాలను నిర్వహించే ఓ సబ్మెరైన్ను తయారు చేసింది. దీనిని అండర్ వాటర్ కేబుళ్లపై నిఘా ఉంచేందుకు, ఇంటర్నెట్ సమాచారం వంటి వాటికోసం వాడేది. 2019లో ఇది సముద్రగర్భంలో ప్రమాదానికి గురై 14 మంది నావికులు సజీవదహనమైపోయారు. ప్రస్తుతం బెస్టర్ డీప్సీ రెస్క్యూ వెహికల్(డీఎస్ఆర్వీ)ను ఉపయోగిస్తోంది. ఇది క్షిపణులు, కూలిపోయిన విమానాల భాగాలను సముద్రపు అడుగుభాగం నుంచి సేకరించగలదు. తాజాగా అమెరికాను భయపెడుతున్నది ఇదే.
ఎఫ్-35లో ప్రత్యర్థుల రాడార్లను తప్పుదోవ పట్టించే టెక్నాలజీ, రహస్య సెన్సర్లు, ఇతర టెక్నాలజీని వినియోగించారు. గతంలో ఎఫ్-117 అనే అత్యాధునిక అమెరికా స్టెల్త్ విమానం 1999లో సెర్బియాలో కూలిపోయింది. ఆ విమాన శకలాలను చైనా సంపాదించి.. తాజాగా జే-20 స్టెల్త్ జెట్ను తయారు చేసింది. ఇప్పుడు రష్యన్లు కూడా అలానే చేస్తారేమో అన్నదే అమెరికా భయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి