జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

Updated : 11 Apr 2021 10:01 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో అల్‌బగర్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హదీపొరా ప్రాంతంలో గుర్తుతెలియని ముష్కరులు నక్కినట్లు వచ్చిన సమాచారంతో  భద్రతా బలగాలు శనివారం ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు సైనికులపైకి కాల్పులు జరిపారు. వాటిని తిప్పికొట్టే క్రమంలో.. సైన్యం ఎదురు కాల్పులు జరపగా ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. అయితే ఉగ్రవాద సంస్థలో ఇటీవల కొత్తగా చేరిన వ్యక్తిని లొంగిపోవాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అతడి తల్లిదండ్రులను తీసుకువచ్చి మరీ వెనక్కి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ, ఇతర ముష్కరులు అతడిని బయటకు రానివ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని  తెలిపారు.  

గురువారం కూడా షోపియాన్‌లోనే సైన్యం, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఐదుగురు ముష్కరులు మరణించారు. వారిలో ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థ నేత ఇంతియాజ్‌ షా ఉన్నట్లు పేర్కొన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు