Jammu air force station: జమ్ము నుంచే వాయుసేన స్థావరంపై దాడి ..!

జూన్‌ 27వ తేదీ రాత్రి వాయుసేన స్థావరంపై దాడి జరిపిన వారు జమ్ము నుంచే డ్రోన్లు ఎగురవేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక సండేగార్డియన్‌ పేర్కొంది. పేలుడు పదార్థాలతో

Published : 16 Aug 2021 01:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : జూన్‌ 27వ తేదీ రాత్రి వాయుసేన స్థావరంపై దాడి జరిపిన వారు జమ్ము నుంచే డ్రోన్లు ఎగురవేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక సండేగార్డియన్‌ పేర్కొంది. పేలుడు పదార్థాలతో రెండు డ్రోన్లు జమ్ము వాయుసేన స్థావరంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని గతంలో ఓ దర్యాప్తు సంస్థ కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు నివేదికను సమర్పించింది. ఈ నివేదిక హోంశాఖకు చేరింది. దీనిపై ఎన్‌ఐఏ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున ఎటువంటి సమాచారం ఇవ్వలేమని తెలిపారు. 

పాకిస్థాన్‌కు ఈ వాయుసేన స్థావరం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఈ స్థావరంలోని హ్యాంగర్ల (విమానాలు, హెలికాప్టర్లను భద్రపర్చే గోదామువంటివి) వద్ద పేలుడు పదార్థాలను జారవిడిచాయి. ఎంఐ17 హెలికాప్టర్లను, రవాణా విమానాలను ఈ ప్రదేశాలకు అత్యంత సమీపంలో భద్రపరుస్తుంటారు.  తొలుత ఈ డ్రోన్లు పాక్‌ నుంచి వచ్చినట్లు అనుమానించారు. కానీ, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ అవి స్థానికంగా ఉన్న వ్యక్తులే వినియోగించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ డ్రోన్లు వాయుసేన స్థావరానికి సమీపం నుంచే ఎగురవేసినట్లు అంచనా వేస్తున్నారు. 

ఈ ఘటన తర్వాత డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి భారత్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.  వీటిల్లో సాఫ్ట్‌కిల్‌, హార్డ్‌కిల్‌ అని రెండు రకాలు ఉంటాయి. డ్రోన్‌ను గుర్తించి దాని కంట్రోలింగ్‌ సంబంధాలను దెబ్బతీయడం సాఫ్ట్‌కిల్‌ కోవలోకి వస్తుంది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్‌ ఆయుధాలను మోహరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని