IAF:నివురుగప్పిన ముప్పు ముంగిట్లో భారత్!
జమ్ములోని కల్చుక్లో ఆదివారం రాత్రి రెండు డ్రోన్లు తిరిగినట్లు సైన్యం గుర్తించింది. రాత్రి 11.45 గంటలప్పుడు ఒక డ్రోన్, అలాగే 2.40 సమయంలో మరో డ్రోన్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ రెండూ క్వాడ్కాప్టర్లే.
‘రెక్కలు’తొడిగిన ఉగ్రవాదం..!
కల్చుక్ సైనిక స్థావరం వద్ద మరో రెండు డ్రోన్లు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
జమ్ములోని కల్చుక్లో ఆదివారం రాత్రి రెండు డ్రోన్లు తిరిగినట్లు సైన్యం గుర్తించింది. రాత్రి 11.45 గంటలప్పుడు ఒక డ్రోన్, అలాగే 2.40 సమయంలో మరో డ్రోన్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ రెండూ క్వాడ్కాప్టర్లే. వీటిపై జవాన్లు 25 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. కానీ చీకట్లో అవి వేగంగా తప్పించుకొన్నాయి. వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరో సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచారం ఆందోళనకరంగా మారింది. దీంతో సైన్యం అప్రమత్తమైంది. ఆ ప్రదేశంలో దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
100 మీటర్ల ఎత్తు నుంచి దాడి
జమ్ములోని వాయుసేన స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి వివరాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇందులో రెండు డ్రోన్లు పాల్గొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. పేలుళ్లకు ముందు రెండు డ్రోన్లు ప్రయాణించిన చప్పుడు వచ్చినట్లు గుర్తించారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఒక్కో డ్రోన్ 2 కిలోల చొప్పున అత్యంత శక్తిమంతమైన ఐఈడీలను మోసుకొచ్చాయి. దాడి చేసిన అనంతరం అవి సురక్షితంగా వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. వీటిని దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి వినియోగించి ఉండొచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బృందాలు అనుమానిస్తున్నాయి. వీటిని పాకిస్థాన్ నుంచి లేదా స్థానిక ఉగ్రవాదుల సాయంతో భారత్ నుంచే ఆపరేట్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ తేలిక పాటి డ్రోన్లు 100- 150 మీటర్ల ఎత్తు నుంచి పేలుడు పదార్థంతో చీకటిలో ప్రయాణించాయి. ఈ కారణంగానే అవి లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించలేకపోయాయని నిపుణులు చెబుతున్నారు. అదే భారీ డ్రోన్లు వస్తే నష్ట తీవ్రత ఎక్కువగానే ఉండేదని వెల్లడించారు.
భారత్లోనే ఆరు లక్షలు..!
ఇటీవల కాలంలో సరిహద్దుల వద్ద డ్రోన్ల సంచారం పెరిగిపోయింది. మరోవైపు చైనా కూడా డ్రోన్ల వినియోగంలో చాలా ముందుంది. ఇక భారత్లో డ్రోన్ల వినియోగానికి సంబంధించి ఎక్కడా నిబంధనలు అమలు చేస్తున్నట్లు కనిపించదు. 2019లో వివిధ భద్రతా సంస్థలు నిర్వహించిన సర్వేలో దేశంలో 6 లక్షలకు పైగా వివిధ సైజులు, సామర్థ్యాలు ఉన్న డ్రోన్లు ఉన్నట్లు తేలింది. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవి ఉగ్రవాదులు, అసాంఘిక శక్తుల చేతిలో పడితే విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక సదుపాయాలకు పెనుముప్పు పొంచి ఉన్నట్లే. సరిహద్దు నగరాలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాల్సిందే. కంపెనీలు, విమనాశ్రయాలకు భధ్రత కల్పించే సీఐఎస్ఎఫ్ స్నైపర్లు, ఎన్ఎస్జీ కమాండోలు, ఇతర భద్రతా సిబ్బందికి వీటిపై ఎలా స్పందించాలనే అంశంపై ఎస్వోపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను వాయుసేన సహకారంతో తయారు చేయాల్సివుంది. భారత్ వద్ద వీటిని ఎదుర్కోవడానికి అవసరమైన టెక్నాలజీ లేదు.
చిన్నవి, రిమోట్ కంట్రోల్ డ్రోన్లతోనే ఎక్కువ ముప్పు పొంచి ఉంది. రూ.20వేలకు దొరికే వాణిజ్య శ్రేణి డ్రోన్లు కూడా 5 కేజీల వరకు బరువును మోయగలవు. ఇవి మన సైనిక రాడార్లలో ఒక చిన్న పక్షివలే కనిపిస్తాయి. దీంతో వీటిని గుర్తించడం చాలా కష్టం. వీటిని కూల్చడానికి భారీ రాకెట్లను, క్షిపణులను ప్రయోగించడం అంటే వనరుల్ని వృథా చేసుకోవడమే. ఈ నేపథ్యంలో భద్రతా సంస్థలు స్కైఫెన్స్, అథెనా, డ్రోన్క్యాచర్, స్కైవాల్ 100 వంటి టెక్నాలజీలను పరిశీలిస్తున్నాయి.
భారత్ ముందున్న మార్గాలు..
సాధారణంగా సైనిక స్థావరాల్లో ఫైటర్ జెట్లను పేలుళ్లకు తట్టుకొనే హ్యాంగర్లలో భద్రపరుస్తారు. కానీ రాడార్లు, ఇతర కమ్యూనికేషన్ సామగ్రి మాత్రం బాహ్య ప్రదేశంలో ఉండాల్సిందే. దీంతో వీటికి డ్రోన్ల ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో డ్రోన్లను గుర్తించే రాడార్లను రంగంలోకి దించడం, లేజర్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్గన్స్ను మోహరించడం వంటివి చేయవచ్చు. ఈ గన్స్ నిమిషానికి 4,600 రౌండ్లు ఫైర్ చేయగలవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..