శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్ల మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. శ్రీనగర్‌ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడికి తెగబడ్డారు. కాగా ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణించగా.. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 05 Oct 2020 16:10 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. శ్రీనగర్‌ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడికి తెగబడ్డారు. కాగా ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులు కాగా.. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌ సరిహద్దులో సీఆర్పీఎఫ్‌కు చెందిన భద్రతా దళాలు జాతీయ రహదారిపై పహారా కాస్తున్నాయి.  ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు భద్రత సిబ్బందిపై బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా గత కొద్ది వారాల వ్యవధిలో ఇదే ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం ఇది మూడో సారి కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని