Twitter: పలువురికి ట్విటర్‌ నోటీసులు

ప్రముఖ కార్టూనిస్ట్‌ మంజుల్‌, ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్‌ ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబైర్‌ సహా పలువురికి ట్విటర్‌ నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంతో వారి ట్వీట్లను......

Published : 12 Jun 2021 20:41 IST

దిల్లీ: ప్రముఖ కార్టూనిస్ట్‌ మంజుల్‌, ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్‌ ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబైర్‌ సహా పలువురికి ట్విటర్‌ నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంతో వారి ట్వీట్లను తొలగించాలని ప్రభుత్వ ఏజెన్సీలు సూచించిన నేపథ్యంలో ఈ నోటీసులు పంపినట్లు వెల్లడించింది. అయితే, ఏ సంస్థలు అడిగాయనే వివరాలను మాత్రం ట్విటర్‌ పేర్కొనలేదు. ట్విటర్‌ నుంచి తమకు అందిన నోటీసులను మంజుల్‌, జుబైర్‌ తదితరులు షేర్‌ చేశారు.

మంజుల్‌కు పంపిన నోటీసులో ‘ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించేదిగా ఉన్న @MANJULtoons ఖాతాలోని కొన్ని ట్వీట్లను తొలగించాలని ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థల నుంచి విజ్ఞాపన వచ్చింది. ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఇలాంటి విన్నపం వచ్చినప్పుడు యూజర్‌ దృష్టికి తీసుకెళ్లడం ట్విటర్‌ బాధ్యత’’ అని ట్విటర్‌ పేర్కొంది. ‘‘కావాలంటే ఈ అంశంపై మీరు కోర్టును ఆశ్రయించ వచ్చు. లేదంటే మీరు స్వచ్ఛందంగా సదరు ట్వీట్‌ను తొలగించ వచ్చు’’ అని తెలిపింది. మహ్మద్‌ జుబైర్‌,  రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సూర్య ప్రతాప్‌ సింగ్‌ సైతం ఇలాంటి నోటీసులనే అందుకున్నారు. ఈ ముగ్గురికీ లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని