మరో 73 మందికి ట్రంప్ క్షమాభిక్ష!
అంతా అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన చివరి పనిదినమైన బుధవారం రోజు అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అయితే, స్వీయ క్షమాభిక్షకు మాత్రం ట్రంప్ మొగ్గుచూపలేదు. అలాగే తన కుటుంబ........
స్వీయక్షమాభిక్షకు మొగ్గుచూపని అధ్యక్షుడు
వాషింగ్టన్: అంతా అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్ష హోదాలో చివరి రోజున అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అయితే, స్వీయ క్షమాభిక్షకు మాత్రం ఆయన మొగ్గుచూపలేదు. అలాగే తన కుటుంబ సభ్యులను కూడా ఈ జాబితాలో చేర్చలేదు.
శ్వేతసౌధం మాజీ ఉన్నతాధికారి స్టీవ్ బ్యానన్ సహా మొత్తం 73 మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. దాదాపు మరో 70 మందికి శిక్షను తగ్గించారు. వైట్హౌజ్ను వీడడానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బహుశా అధ్యక్ష హోదాలో ఆయన తీసుకున్న చివరి నిర్ణయం ఇదే కావొచ్చని తెలుస్తోంది. ఈ జాబితాపై ఆయన చాలాసేపు కసరత్తు చేశారని శ్వేతసౌధంలోని ఓ అధికారి తెలిపారు. చివరి నిమిషంలో ఆయన జాబితాను మార్చే అవకాశమూ లేకపోలేదని తెలిపారు. ఉత్తర్వులపై సంతకం చేసే వరకు ఏమీ చెప్పలేమని అభిప్రాయపడ్డారు.
సాధారణంగా కనీసం కొన్ని నెలల పాటు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష ప్రసాదిస్తారు. బ్యానన్ విషయంలో మాత్రం అది జరగలేదు. ఆయన ఇటీవలే జైలుకు వెళ్లారు. కనీస శిక్షాకాలాన్ని పూర్తి చేయకముందే ఆయనను ట్రంప్ క్షమించేశారు. మెక్సికో సరిహద్దుల్లో నిర్మిస్తున్న గోడ కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసిన విషయంలో కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ఈ ప్రాజెక్టు ట్రంప్ మానసపుత్రిక అన్న విషయం తెలిసిందే. ఆయన అంతగా పట్టుబట్టి సాధించుకున్న ఈ ప్రాజెక్టులో మోసాలకు పాల్పడ్డ బ్యానన్ను క్షమించడంపై పలువురు చట్టసభ సభ్యులు పెదవి విరిచారు. బ్యానన్ 2016 ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రచార బృందంలో కీలక పాత్ర పోషించారు.
డిసెంబరులోనే 40 మందికి పైగా వ్యక్తులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. వీరిలో వైట్ హౌస్ ఉన్నతాధికారి మైకేల్ ఫ్లిన్ సహా ఆయన మద్దతుదారులు, ఆయనతో పనిచేసిన మాజీ అధికారులు, రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఉన్నారు. పదవిలో ఉండగానే తన తప్పిదాల నుంచి విముక్తి కల్పించుకోడానికి ‘స్వీయ క్షమాభిక్ష’ పెట్టుకోవడానికి ట్రంప్ యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ విశేషాధికారంపై ఆయన తన సలహాదారులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారని సమాచారం. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. తప్పులను స్వయంగా ఒప్పుకున్నట్లవుతందని వారు హెచ్చరించడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల