Omicron Timeline: ఒమిక్రాన్.. ఏ దేశంలోకి ఎప్పుడు?
ఒమిక్రాన్ వేరియంట్ దావానలంలా వ్యాపిస్తుండటంతో ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకుంటోంది. రోజుల వ్యవధిలోనే ఈ కొత్త వేరియంట్ దాదాపు.....
ఇంటర్నెట్ డెస్క్: ఒమిక్రాన్ వేరియంట్ దావానలంలా వ్యాపిస్తుండటంతో ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకుంటోంది. రోజుల వ్యవధిలోనే ఈ కొత్త వేరియంట్ దాదాపు 30 దేశాలకు పాకేసింది. డెల్టా రకం కంటే ఆరు రెట్లు వేగంతో వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ ఆందోళనకర వేరియంట్ భారత్లోనూ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన ఇద్దరు పురుషుల్లో ఒమిక్రాన్ వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, తీవ్రమైన లక్షణాలేవీ లేవని.. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. భయపెడుతున్న ఈ ఒమిక్రాన్ ఏయే దేశాలకు ఎప్పుడు పాకిందో ఓసారి చూస్తే..!
* నవంబర్ 24న తొలిసారి రెండు దేశాల్లో B.1.1.529 (ఒమిక్రాన్) వేరియంట్ని డబ్ల్యూహెచ్వో గుర్తించింది. దక్షిణాఫ్రికాలోని గుటాంగ్ ప్రావెన్స్తో పాటు బోట్స్వానా దేశంలో ఒకే రోజు ఈ కేసులు వెలుగుచూశాయి.
* నవంబర్ 26న దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. ఆ రోజు నాలుగు దేశాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. నెదర్లాండ్, ఇజ్రాయెల్, హాంగ్కాంగ్, బెల్జియంలలో ఒమిక్రాన్ కేసులు గుర్తించారు.
* నవంబర్ 27న మరో ఐదు దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు చెక్ రిపబ్లిక్, ఇటలీ, జర్మనీ, ఇంగ్లాండ్.
* నవంబర్ 28న డెన్మార్క్, ఆస్ట్రియాలో వెలుగుచూడగా.. నవంబర్ 29న మరో నాలుగు దేశాలకు (కెనడా, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్) ఒమిక్రాన్ వ్యాపించింది. ఆ తర్వాత 30న ఫ్రాన్స్, జపాన్, పోర్చుగల్లలో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
* డిసెంబర్ 1న అత్యధికంగా తొమ్మిది దేశాలకు విస్తరించింది. బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, నార్వే, ఐర్లాండ్, అమెరికా, ఘనా, యూఏఈ, నైజీరియాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.
* తాజాగా డిసెంబర్ 2న భారత్లో రెండు కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM