బ్రెజిల్లో 5 లక్షల కరోనా మరణాలు!
కరోనా వైరస్ విజృంభణతో వణికిపోతోన్న బ్రెజిల్కు తాజాగా మూడో ముప్పు ముంచుకొచ్చింది.
ఆంక్షల సడలింపుతో థర్డ్వేవ్ ఉద్ధృతి
బ్రెసీలియా: కరోనా వైరస్ విజృంభణతో వణికిపోతోన్న బ్రెజిల్కు మూడో ముప్పు ముంచుకొచ్చింది. నిత్యం వేల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అక్కడ కొవిడ్ మరణాల సంఖ్య 5లక్షలు దాటింది. మరణాల సంఖ్యలో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పక్కనబెట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో బ్రెజిల్ మరోముప్పు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ దక్షిణ అమెరికా దేశాలు మాత్రం విలవిల్లాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న బ్రెజిల్లో కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంలేదు. తాజాగా అక్కడ మూడో దశ విజృంభణ మొదలైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 24గంటల్లోనే 2,300 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5లక్షలు దాటింది. నమోదైన మరణాల సంఖ్య ఇలా ఉంటే... వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సెకండ్ వేవ్కి విలవిల..
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నెల మధ్య కాలంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో బ్రెజిల్ వణికిపోయింది. మనాస్లో వెలుగు చూసిన గామా వేరియంట్ దాటికి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం మే వరకు కొనసాగింది. కాస్త గడువిచ్చినట్లు కనిపించినప్పటికీ.. ప్రస్తుతం మరోసారి విశ్వరూపం చూపిస్తోంది. మే 10 తర్వాత కొవిడ్ మరణాల సంఖ్య తొలిసారి 2వేలు దాటింది.
మాస్కులు లేకుండానే..!
బ్రెజిల్లో ప్రస్తుతం కొవిడ్ ఆంక్షలకు సడలింపు ఇచ్చారు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు సమూహాలుగా ఏర్పడుతున్నారు. బార్లు, రెస్టారెంట్లు సాధారణ స్థితికి చేరుకోవడం, షాపింగ్ సమయాల్లోనూ ప్రజలు మాస్కులు ధరించకుండా కనిపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 27రాష్ట్రాల్లో దాదాపు 19రాష్ట్రాల్లో కొవిడ్ ఐసీయూ బెడ్లు 80శాతం నిండివున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో తొమ్మిది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు సమాచారం. రోజువారీ మరణాల సంఖ్య 2వేలు ఉన్న సమయంలోనే కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడం తొందరపాటు చర్యేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.