రెండోసారి కరోనా.. రోగనిరోధకతపై అనుమానాలు!
మహమ్మారి కరోనాతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు. అనేక మంది వైరస్ బారిన పడ్డారు. అయితే, వీరిలో చాలా మంది కోలుకుంటుండడం ఇప్పటి వరకు ఊరటనిస్తున్న అంశం..........
లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన కీలక అధ్యయనం
ప్యారిస్: మహమ్మారి కరోనాతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు. అనేక మంది వైరస్ బారిన పడ్డారు. అయితే, వీరిలో చాలా మంది కోలుకుంటుండడం ఇప్పటి వరకు ఊరటనిస్తున్న అంశం. భారత్లో గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. వైరస్ను మొత్తంగా కట్టడి చేయలేకపోతున్నా.. మరణాలనైనా అదుపు చేయగలుగుతున్నామని సాంత్వన చెందుతున్నాం. ఈ తరుణంలో ఒకే వ్యక్తికి రెండోసారి వైరస్ సోకుతోందన్న వార్త తీవ్రంగా కలచివేస్తోంది. పైగా అది మరింత తీవ్రంగా ఉంటోందన్న అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు ప్రముఖ జర్నల్ ల్యాన్సెట్లో ప్రచురితమైన ‘నెవాడా స్టేట్ పబ్లిక్ హెల్త్ లేబోరేటరీ’ అధ్యయనం చేదు విషయాల్ని మన ముందుంచింది.
ప్రాణాంతక కరోనా వైరస్ రెండోసారి సోకే అవకాశం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. రెండోసారి సోకినప్పుడు లక్షణాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇందుకు అమెరికాలోని నెవాడాకు చెందిన 25 ఏళ్ల యువకుడి ఉదంతాన్ని ఉదహరించింది. 48 రోజుల వ్యవధిలో రెండోసారి అతనికి వైరస్ సోకడాన్ని నిర్ధరించింది. రెండుసార్లు వేర్వేరు రకాల వైరస్లు సోకినట్లు స్పష్టం చేసింది. అంటే రెండోసారి.. ఉత్పరివర్తనం చెందిన వైరస్ దాడి చేసినట్లు తెలిపింది.
అసలు రోగనిరోధక శక్తి ఎన్నాళ్లుంటుంది?
రెండోసారి వైరస్ సోకే అవకాశం ఉందన్న నిజం మహమ్మారిని అర్థం చేసుకోవడం సహా వ్యాక్సిన్ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు వెల్లడించారు. ఇంకా సమర్థమైన టీకా అందుబాటులో లేని సమయంలో రెండోసారి వైరస్ సోకడం వల్ల తీవ్ర పరిణామాలుండే అవకాశం ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన మార్క్ పండోరీ తెలిపారు. అసలు కొవిడ్-19 బారిన పడ్డ వ్యక్తిలో రోగనిరోధక శక్తి ఎంత కాలం ఉంటుందన్న విషయంపై లోతైన అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని పండోరీ అభిప్రాయపడ్డారు. నెవాడా బాధితుడు రెండోసారి.. ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉన్న లేదా భారీ వైరల్ లోడ్కు గురై ఉంటారని అంచనా వేశారు. అందుకే తొలిసారి స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ.. రెండోసారి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.
రెండోసారని ఎలా నిర్ధారిస్తారు?
మరోవైపు కొంతమంది శాస్త్రవేత్తలు రెండోసారి వైరస్ సోకుతోందన్న వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇప్పటి వరకు కోట్ల మంది వైరస్ బారిన పడగా.. వీరిలో కేవలం పదుల సంఖ్యలోనే రెండోసారి వైరస్ సోకినట్లు భావిస్తున్నామన్నారు. అయితే, తొలిసారి సోకిన వైరస్సే పూర్తిగా నయం కాకపోవడం వల్ల రెండోసారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్గా తేలి ఉండే అవకాశం ఉందని యేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అకికో ఇవాసకా అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో లోపం వల్ల వైరస్ బాధితుడికి ఓసారి నెగెటివ్ మరోసారి పాజిటివ్గా తేలే అవకాశం ఉందన్నారు. లేదా తొలిసారి వైరస్ సోకినప్పుడు ఏర్పడ్డ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండి ఉండవచ్చునన్నారు. ఇలాంటి మరిన్ని కేసులు.. తరచూ సంభవిస్తే లోతైన పరిశోధన జరపాలన్నారు. ఇది వ్యాక్సిన్ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందన్నారు. నిరోధకత ఏ స్థాయిలో ఉంటే వైరస్ను టీకా అడ్డుకోగలుగుతుందనే విషయాన్ని ముందుగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.