మార్చి చివరినాటికి యాక్టివ్ కేసుల్లో తగ్గుదల!
మార్చి చివరినాటికి భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని కరోనా వైరస్ తీవ్రతపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ సూపర్మోడల్ కమిటీ అంచనా వేసింది.
నేషనల్ సూపర్మోడల్ కమిటీ అంచనా
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుతోందని భావిస్తోన్న సమయంలోనే మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య దాదాపు లక్షా 50వేలకు చేరింది. అయితే, మార్చి చివరినాటికి ఈ యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని కరోనా వైరస్ తీవ్రతపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ సూపర్మోడల్ కమిటీ అంచనా వేసింది.
‘కరోనా వైరస్ను ఎదుర్కొనే రోగ నిరోధకత దేశ ప్రజల్లో ఎక్కువ మందిలో ఉన్నట్లు సిరోలాజికల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీటితోపాటు వైరస్ను ఎదుర్కొనే సాధారణ రోగనిరోధకత కూడా భారతీయుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా సాధారణంగా పొందిన దానికంటే అదనంగా ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ వల్ల కరోనా వైరస్ నుంచి దీర్ఘకాలిక రక్షణ కలుగుతుంది. ఇది వైరస్ వ్యాప్తి కట్టడికి ఎంతో దోహదపడుతుంది’ అని నిపుణుల కమిటీ అంచనా వేసింది. వ్యాక్సిన్ల సమర్థతపైనా స్పందించిన కమిటీ, ఒక్కో వ్యాక్సిన్ సమర్థత ఒక్కోవిధంగా ఉందని, ఈ నేపథ్యంలో నియంత్రణ సంస్థల నిర్ణయంపైనే నమ్మకం ఉంచాలని అభిప్రాయపడింది.
మ్యుటేషన్ చెందిన కరోనా వైరస్ల నుంచి ఈ రోగనిరోధకత అంతగా రక్షణ కలిగించలేదని కొందరు వాదిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్తరకం వైరస్లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగివున్నట్లు ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీని ముమ్మరంగా చేపట్టడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. భారత్లో కరోనా వైరస్ గతేడాది సెప్టెంబర్లోనే గరిష్ఠ తీవ్రతను చవిచూసిందని, అప్పటినుంచి కేసుల్లో తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించింది.
ఇవన్నీ తొలిదశ ముగింపు వరకు గణాంకాలు మాత్రమేనని, ఇప్పటికే పలుచోట్ల రెండోదశ వ్యాప్తి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఇటలీ, బ్రిటన్, అమెరికా దేశాల్లో జరిగినట్లు ఇక్కడ నిర్లక్ష్యం చేయవద్దని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కేవలం ఒక్క భారత్లో వైరస్ వ్యాప్తిని తగ్గిస్తే సరిపోదని, ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని కట్టడిచేస్తేనే ఇది అదుపులోకి వస్తుందని పేర్కొంది. అందుచేత ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇందులో భాగంగా, భారత్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయగా, దేశ అవసరాలతో పాటే ఇతర దేశాలకు భారత్ వ్యాక్సిన్ సరఫరా చేయడం ఆహ్వానించదగ్గ విషయమని అభిప్రాయపడింది.
దేశంలో కరోనా వైరస్ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేతృత్వంలో నేషనల్ సూపర్మోడల్ కమిటీని కేంద్రం నియమించింది. చెన్నై గణిత కేంద్రానికి చెందిన రాజీవ్ ఎల్ కరాందికర్, సీఎస్ఐఆర్కు చెందిన డాక్టర్ శేఖర్ సీ.ముండే, ఐఐటీ హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ విద్యాసాగర్లతో ఏర్పాటైన నిపుణుల కమిటీ తాజాగా ఓ నివేదికను రూపొందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!