పర్యాటకులకు చెత్త పంపుతున్న థాయ్లాండ్
ఎక్కడైనా పర్యటనలకు వెళ్లి వస్తే మనతోపాటు అక్కడ గడిపిన జ్ఞాపకాలు, మధుర స్మృతులు వెంట వస్తాయి. కానీ, ఇకపై థాయ్లాండ్లోని ఓ జాతీయ పార్కును సందర్శిస్తే మాత్రం మీరు అక్కడ పడేసిన చెత్త వెంట రాబోతుంది. విచిత్రంగా ఉంది కదా..! నిజమేనండీ..
ఇంటర్నెట్ డెస్క్: ఎక్కడైనా పర్యటనలకు వెళ్లి వస్తే మనతోపాటు అక్కడ గడిపిన జ్ఞాపకాలు, మధుర స్మృతులు వెంట వస్తాయి. కానీ, ఇకపై థాయ్లాండ్లోని ఓ జాతీయ పార్కును సందర్శిస్తే మాత్రం మీరు అక్కడ పడేసిన చెత్త మీ వెంట వస్తుంది. విచిత్రంగా ఉంది కదా..! నిజమేనండీ.. ఆ పార్క్లో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేసే పర్యాటకులకు బుద్ధి చెప్పాలని, పర్యావరణాన్ని కాపాడాలని థాయ్లాండ్ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.
థాయ్లాండ్లోని కవో యాయ్ జాతీయ పార్కు, ఆ దేశంలో చూడాల్సిన సందర్శక ప్రాంతాల్లో ఇదీ ఒకటి. ఇక్కడికి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ పార్క్లో వాటర్ఫాల్స్, ట్రెక్కింగ్ వంటివి ఆకట్టుకుంటాయి. పర్యాటకులు ఇక్కడ సమయం గడపడం కోసం టెంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే కొందరు పర్యాటకులు ఈ టెంట్లలో గడిపి.. తిను బండారాల ప్యాకెట్లు, నీరు.. కూల్డ్రింక్స్ బాటిళ్లు తదితర చెత్తను తీసేయకుండా అక్కడే పడేసి వెళ్తున్నారట. పరిశుభ్రతపై కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించే పర్యాటకులకు బుద్ధి చెప్పాలని అక్కడి ప్రభుత్వం, పార్క్ యాజమాన్యం భావించింది. దీంతో ఇకపై పర్యాటకులు చెత్తను నిర్దేశించిన ప్రాంతంలో పడేయకుండా టెంట్లు, పార్కులో పడేస్తే.. టెంట్లు బుక్ చేసుకునే సమయంలో ఇచ్చిన చిరునామా ఆధారంగా వారు వదిలేసిన చెత్తను పార్శిల్ చేసి వారికే పంపిస్తారట. ఈ మేరకు ఆ దేశ పర్యావరణశాఖ మంత్రి వరావుత్ సిల్పా ఇటీవల సోషల్మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఆ పనులు ప్రారంభమయ్యాయని కొందరు పర్యటకులకు వారు వేసిన చెత్తను పార్శిల్ చేసి పంపిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా