Afghan Food Crisis: ఆకలితో అలమటిస్తోన్న అఫ్గాన్.. సగం మంది పస్తులే!
అఫ్గాన్లో లక్షల మందికి పూర్తి స్థాయిలో తిండి దొరకక పస్తులే ఉంటున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ శీతాకాలంలో దాదాపు సగం మంది అఫ్గాన్వాసులు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారని హెచ్చరిస్తున్నాయి.
ఆహార సంక్షోభం తీవ్రమైందన్న ఐక్యరాజ్యసమితి
కాబుల్: తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్లో ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే లక్షల మందికి పూర్తి స్థాయిలో తిండి దొరకక పస్తులే ఉంటున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ శీతాకాలంలో దాదాపు సగం మంది అఫ్గాన్వాసులు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారని పేర్కొంటున్నాయి. తక్షణమే వీటి నుంచి బయటపడే చర్యలు చేపట్టకపోతే అఫ్గానీయుల ఆకలి కేకలతో అక్కడ దారుణ పరిస్థితులు ఏర్పడుతాయని ఐక్యరాజ్యసమితి మరోసారి హెచ్చరించింది.
‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించకుంటే ఈ శీతాకాలంలో లక్షల మంది అఫ్గాన్ వాసులు వలస వెళ్లడమో లేదా ఆకలితో అలమటించడమో ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అఫ్గాన్ ఎదుర్కొంటున్న సంక్షోభం యెమన్, సిరియా దేశాల కంటే అత్యంత తీవ్రమైనది. ప్రపంచంలోనే దారుణమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గాన్లో ఆహార భద్రత పూర్తిగా కుప్పకూలింది. మహా విపత్తుకు కౌంట్డౌన్ మొదలయ్యిందని.. తక్షణమే చర్యలు చేపట్టకపోతే మన చేతులతోనే విపత్తును చవిచూస్తాం’ అని ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బియాస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలితో పిల్లలు చనిపోతున్నారన్న ఆయన.. వారికి సరైన ఆహారం అందిస్తామనే భరోసా కూడా ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డబ్బు రూపంలో నిధులను సత్వరమే అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డేవిడ్ బియాస్లీ అభిప్రాయపడ్డారు.
ప్రతి ఇద్దరిలో ఒకరికి తీవ్ర ఆహార కొరత..
అఫ్గాన్లో ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP)తోపాటు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) హెచ్చరించాయి. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు ఫేజ్ 3 సంక్షోభం లేదా ఫేజ్ 4 ఎమర్జెన్సీ ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశాయి. ఫేజ్ 4 అంటే తీవ్ర కరవుకు దగ్గరలో ఉన్నట్లు భావిస్తారు. ఈ శీతాకాలంలో ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.
ప్రయత్నాలు చేస్తున్నాం..
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నుంచి తమ ప్రజలను బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆహారం, దుస్తులు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఈ ఇబ్బందులు పరిష్కారమవుతాయని ముజాహిద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కరువు పరిస్థితులపై మాట్లాడిన ఆయన.. ఈ శీతాకాలం పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు.
ఇదిలాఉంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గాన్ను అంతర్జాతీయంగా గుర్తించేందుకు దాదాపు అన్ని దేశాలు వెనకాడుతున్నాయి. ఇదే సమయంలో అఫ్గాన్పై ప్రపంచ దేశాలు ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తున్నాయి. వీటితోపాటు ఇస్లామిక్ స్టేట్ దాడులు కూడా ఎక్కువ కావడం అఫ్గానీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు వాతావరణ పరిస్థితులతో అక్కడ తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వేల మంది పేద ప్రజలు పొట్టచేతబట్టుకుని నగరాలకు తరలిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు