Covid: కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల కేసులు..!
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య తాజాగా 25 కోట్ల మార్కును దాటింది.
పలు దేశాల్లో మళ్లీ విజృంభిస్తోన్న మహమ్మారి
న్యూయార్క్: కరోనా మహమ్మారి వెలుగు చూసి రెండేళ్లు సమీపిస్తున్నప్పటికీ పలు దేశాల్లో వైరస్ ఉద్ధృతి మాత్రం అదుపులోకి రాలేదు. కొవిడ్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ను విస్తృతంగా పంపిణీ చేస్తున్నా.. మహమ్మారి నియంత్రణలోకి రావడం లేదు. ముఖ్యంగా డెల్టా వేరియంట్ ప్రభావంతో పలు దేశాల్లో మరోసారి విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య తాజాగా 25 కోట్ల మార్కును దాటింది. అత్యధికంగా అమెరికాలో ఇప్పటివరకు 4.6కోట్ల కేసులు నమోదుకాగా, భారత్లో దాదాపు 3కోట్ల 43లక్షలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య ఈ మధ్యే 50లక్షల మార్కును దాటిన విషయం తెలిసిందే.
ప్రతి 3 నెలలకు 5కోట్ల కేసులు..
వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో పలు దేశాల్లో వైరస్ ఉద్ధృతి కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన మూడు నెలలుగా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 36శాతం తగ్గింది. అయినప్పటికీ ప్రతి మూడు నెలల్లో 5కోట్ల మంది ఇన్ఫెక్షన్ బారినపడుతున్నారు. వైరస్ వెలుగు చూసిన మొదట్లో 5కోట్ల కేసులు నమోదు కావడానికి ఏడాది సమయం పట్టింది. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు 5కోట్ల కేసులు నమోదవుతున్నాయి. పలు దేశాల్లో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.
యూరప్లో మళ్లీ విజృంభణ..
రష్యా, ఉక్రెయిన్, గ్రీస్ వంటి దాదాపు 55 దేశాల్లో ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. యూరప్లో పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండడం వైరస్ విజృంభణకు ఒక కారణంగా తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికంటే ఎక్కువగా ఈ యూరప్ దేశాల్లోనే నమోదవుతున్నాయి. ప్రతి నాలుగు రోజులకు ఇక్కడ 10లక్షల కేసులు బయటపడుతున్నాయి. రష్యాలో ఇప్పటివరకు 88లక్షల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గతకొన్ని రోజులుగా అక్కడ నిత్యం వెయ్యి కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. నవంబర్ 8న ఒక్కరోజే అత్యధికంగా 1190 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7వరకు రష్యాలో హాలీడే ప్రకటించారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, ఇప్పటికే ఎంతోమంది ఇన్ఫెక్షన్ బారినపడి కోలుకోవడంతో చాలా దేశాలు వైరస్ ఉద్ధృతి తీవ్ర స్థాయిని దాటిపోయినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ చల్లని వాతావరణం, ప్రజలు భారీ సంఖ్యలో సమూహాలుగా ఏర్పడుతుండడం వల్ల కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటినుంచి 2022 చివరి మధ్యకాలంలో వైరస్ ఉద్ధృతిని కట్టడి చేయడంతోపాటు తీవ్రత ఎక్కువ కలిగిన కేసులు, మరణాలను సాధ్యమైనంత వరకు తగ్గించగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్ మారియా వాన్ ఖేర్కోవ్ పేర్కొన్నారు.
టీకా కోసం పేద దేశాల ఎదురుచూపు..
ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పేద దేశాల్లో మాత్రం కనీసం ఒక్క డోసు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఆయా దేశాల్లో ఇప్పటికీ 5శాతం కంటే తక్కువ మందికే కొవిడ్ టీకా అందింది. ఇలాంటి సందర్భంలో అల్ప ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు సంపన్న దేశాలు ముందుకు రావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుసార్లు విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన 20దేశాలు దాదాపు 23.4బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చాలని పిలుపునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించడంపై ఆప్ స్పందించింది. ఆయనను చంపేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
లోక్సభ ఎన్నికల తొలి దశకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు శుక్రవారం (ఏప్రిల్ 19న) పోలింగ్ నిర్వహించనున్నారు. -
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు. -
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
Dubai Rains: దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు