B.1.1.529 Variant: కొత్త వేరియంట్తో ప్రపంచ దేశాల్లో కలవరం!
విస్తృత వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ (B.1.1.529) అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తోన్న నేపథ్యంలో ఆయా దేశాలను కొవిడ్ భయాలు మరోసారి వెంటాడుతున్నాయి.
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి తగ్గుతోందని భావిస్తున్న సమయంలోనే దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరోసారి వైరస్ విజృంభణతో సతమతమవుతున్న యూరప్ దేశాలతో పాటు వైరస్ను సమర్థంగా కట్టడి చేస్తున్న దేశాలు కూడా కలవరపడుతున్నాయి. మరోవైపు కొత్తవేరియంట్ భయంతో ఆసియా, యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా ఒడుదొడుకులకు గురికావడం స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే విస్తృత వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ (B.1.1.529) అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలను కొవిడ్ భయాలు మరోసారి వెంటాడుతున్నాయి.
కలవరపడుతోన్న దేశాలు..: కొవిడ్ విలయంతో మరోసారి అల్లాడిపోతున్న యూరప్ దేశాలు.. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్తో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే విస్తృతంగా వ్యాప్తిస్తున్న కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయలేకపోతున్న ఈయూ దేశాలకు కొత్త వేరియంట్ మరింత సమస్యగా మారనుందని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ కంటే విస్తృత వ్యాప్తి కలిగి ఉండడంతో పాటు దీనిపై ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు తక్కువ సమర్థత కలిగివున్నట్లు తెలుస్తోందని బ్రిటిష్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ వాజిద్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సాధ్యమైనంత తొందరగా దీనిపై చర్యలకు ఉపక్రమించాలని అక్కడి చట్టసభ సభ్యులకు సూచించారు. ఇప్పటికే ఈ వేరియంట్కు సంబంధించి దక్షిణాఫ్రికాలో 22 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇజ్రాయెల్లోనూ తొలి కేసు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే ముందున్న ఇజ్రాయెల్ తాజాగా కొత్త వేరియంట్తోనూ కలవరపడుతోంది. మాలావి నుంచి ఒక వ్యక్తిలో ఈ వేరియంట్ వెలుగు చూడగా అనుమానిత లక్షణాలున్న మరో ఇద్దరిని ఐసోలేషన్లో ఉంచి పరీక్షిస్తోంది.
ప్రయాణ ఆంక్షలకు సిద్ధం: కొత్త వేరియంట్తో అప్రమత్తమవుతున్న దేశాలు, ముందుజాగ్రత్తగా ప్రయాణ ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. దక్షిణాఫ్రికాతోపాటు మరో ఐదు దేశాలనుంచి వచ్చే విమానాలను నిషేధిస్తున్నట్లు బ్రిటన్ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని పేర్కొంది. ఇదే దారిలో పయణించేందుకు జర్మనీ కూడా సిద్ధమైంది. దక్షిణాఫ్రికా నుంచి కేవలం తమ పౌరులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఇటలీ కూడా ఆఫ్రికాలోని ఏడు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించింది. నెదర్లాండ్ కూడా ఇలాంటి ఆంక్షలను అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇక దక్షిణాఫ్రికాతో పాటు పలు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పదిరోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని జపాన్ ఆదేశించింది. వీరికి మూడు, ఆరు, పదో రోజు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా కూడా ప్రయాణికులకు మళ్లీ కఠిన క్వారెంటైన్ నిబంధనలు అమలు చేసే పనిలో పడింది. ఇటు భారత్ కూడా కొత్త వేరియంట్పై రాష్ట్రాలను హెచ్చరించింది.
స్టాక్ మార్కెట్లు కుదేలు: కేవలం ఆయా దేశాలనే కాకుండా యూరప్, ఆసియాతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లను కూడా కొత్త వేరియంట్ వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ భయాలతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరోవైపు ఈ వేరియంట్ ధాటికి ఎయిర్లైన్స్ షేర్లు కుదేలయ్యాయి. లుఫ్తాన్సా 12.4శాతం, బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఐఏజీ, ఐబీరియా షేర్లు 14.4 శాతం పడిపోయాయి. వీటితోపాటు ఎయిర్ ఫ్రాన్స్-కేఎల్ఎం షేర్లు 8.9శాతం తగ్గిపోగా ఈజీజెట్ షేర్లు 10.9 శాతం తగ్గిపోయాయి. భారత్లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది.
తొందరపడొద్దు: WHO: అయితే, కొత్త వేరియంట్తో ప్రపంచ దేశాలు కలవరపడుతున్న నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేడు భేటీ అయ్యింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని పలు దేశాలనుంచి ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్లు ఈయూ పేర్కొనడంపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. గతంలోనూ కొత్త వేరియంట్లు వెలుగు చూసిన వెంటనే అత్యవసరంగా సరిహద్దులు మూసివేసి, ప్రయాణాలపై ఆంక్షలు విధించామని గుర్తుచేసింది. ఇలా తొందరపడి నిర్ధారణకు వచ్చి నిర్ణయాలు తీసుకోకుండా.. పరిస్థితులపై మాత్రం ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?