Europe: కరోనా విలయం.. ఇలాగైతే మరో 3నెలల్లో 5 లక్షల మరణాలు!
గతేడాది మాదిరిగానే మహమ్మారి విజృంభణకు యూరప్ కేంద్రబిందువుగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
లండన్: యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ రాకతో వైరస్ విజృంభణ కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ పలు దేశాల్లో మళ్లీ కోరలు చాచుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది మాదిరిగానే మహమ్మారి విజృంభణకు యూరప్ కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గడిచిన కొన్ని వారాల్లో అక్కడ పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఆస్పత్రుల్లో చేరికలు ఇలాగే కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 5లక్షల కొవిడ్ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు దేశాల్లో కొవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం గడిచిన వారంలోనే యూరప్ వ్యాప్తంగా కొత్తగా 18లక్షల కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల్లో 6శాతం పెరుగుదల కనిపించింది. వీటితో పాటు గతవారంలో మరణాల సంఖ్య 24వేలకు చేరుకుంది. అక్కడి కొవిడ్ మరణాల్లో ఏకంగా 12శాతం పెరుగుదల కనిపించింది. ప్రతి లక్ష మందికి 192 కేసులు బయటపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గతవారం నమోదైన మొత్తం కేసుల్లో 59శాతం ఉండగా, సగం మరణాలు ఇక్కడే చోటుచేసుకున్నాయి.
ఫిబ్రవరి నాటికి 5లక్షల మరణాలు..
గత ఐదు వారాలుగా అక్కడ పెరుగుతోన్న కొవిడ్ తీవ్రత.. మరికొన్ని రోజులపాటు ఇలాగే కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి యూరప్లో 5లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగే హెచ్చరించారు. వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ కొవిడ్ తీవ్రత క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమని అభిప్రాయపడ్డారు. అయితే, కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారిలో అధికంగా పూర్తి మోతాదులో వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నట్లు వెల్లడించారు. ఇలా వైరస్ తీవ్రత పెరుగుతుండటం చూస్తుంటే మరో వేవ్ ముంచుకొస్తుందనే విషయం స్పష్టమవుతోందని స్వీడన్ చీఫ్ ఎపిడమాలజిస్ట్ ఆండర్స్ టెగ్నెల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా శీతాకాలంలో వైరస్ విజృంభణ పెరగడం ఈ ఆందోళన పెరగడానికి కారణమని అన్నారు.
మందగించిన వ్యాక్సినేషన్..
యూరప్ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగినప్పటికీ పలు దేశాల్లో పూర్తి స్థాయిలో టీకాను అందించలేకపోతున్నాయి. యూరప్లో సరాసరిగా 47శాతం పూర్తిస్థాయిలో పంపిణీ చేశారు. కేవలం 8 దేశాలు మాత్రమే 70శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించాయి. ఇదే సమయంలో సరైన వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నప్పటికీ మిగతావారు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదనే వాదన ఉంది. మరో ముప్పు పొంచివున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఆమ్స్టర్డామ్లోని యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక ఈ ప్రాంతంలో కొవిడ్ వ్యాక్సిన్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నప్పటికీ.. అవి అన్ని ప్రాంతాలకు సమానంగా చేరడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ మైక్ రేయాన్ అభిప్రాయపడ్డారు. ఈ అగాధాన్ని వెంటనే సరిచేయడంతో పాటు కొవిడ్ కట్టడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని యూరప్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?