WHO: మహమ్మారి ప్రతాపం.. వారంలోనే 50 లక్షల కేసులు..!
గడిచిన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 50లక్షల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.
అప్రమత్తంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
బెర్లిన్: ప్రపంచ దేశాలకు కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తోన్న వేళ ఆయా దేశాల్లో కొవిడ్-19 ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఇలా డిసెంబర్ 20-26 తేదీల మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమారు 50లక్షల కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో 11శాతం పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. ముఖ్యంగా అమెరికాలో కేసులు భారీగా పెరగగా.. అక్కడ అక్టోబర్ నుంచే వైరస్ విజృంభణ మరోసారి మొదలైనట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
కొవిడ్ తీవ్రత ఎక్కువగా అమెరికా, ఐరోపా దేశాల్లో కనిపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గడిచిన వారంలో నమోదైన మొత్తం 49.9లక్షల కేసుల్లో 28లక్షల కేసులు కేవలం యూరప్లోనే ఉన్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే అక్కడి పాజిటివ్ కేసుల్లో 3శాతం పెరుగుదల కనిపించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా యూరప్లోనే ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంది. ప్రతి లక్ష జనాభాలో పాజిటివ్ కేసుల సంఖ్య 304.6గా నమోదవుతుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
అటు అమెరికాలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతున్నాయని.. గతవారంలోనే 14.8లక్షల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అంతకుముందు వారంతో పోలిస్తే 39శాతం పెరిగింది. అంతేకాకుండా యూరప్ తర్వాత అత్యధిక ఇన్ఫెక్షన్ రేటు అమెరికాలోనే ఉంది. ప్రస్తుతం ప్రతి లక్ష జనాభాలో 144.4 కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇక ఆఫ్రికాలో గతవారం 2 లక్షల 75వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా కొత్త కేసుల్లో 7శాతం పెరుగుదల కనిపించింది.
ముప్పు అధికమే..
తాజా పరిస్థితులను బట్టి చూస్తే కొత్త వేరియంట్ ముప్పు అధికంగానే ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎక్కువ ప్రాబల్యం డెల్టాదే ఉండగా.. తాజాగా దీన్ని మించి ఒమిక్రాన్ వ్యాపిస్తుందనడానికి ఆధారాలు అభిస్తున్నాయని స్పష్టం చేసింది. అయితే, దక్షిణాఫ్రికా, యూకే, డెన్మార్క్లనుంచి వస్తోన్న సమాచారాన్ని చూస్తే ఒమిక్రాన్తో ఆస్పత్రి బారినపడే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది. అయినప్పటికీ ఆక్సిజన్, వెంటిలేషన్ అవసరాలతో పాటు మరణం ముప్పుకి సంబంధించి ప్రభావాలను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరముందని పేర్కొంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా గతవారంలో కొవిడ్ మరణాల సంఖ్య 4శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం