Supreme Court: ఆసుపత్రులేమీ పోలీసుస్టేషన్లు కాదు..
ఆసుపత్రులేమీ పోలీసు స్టేషన్లు కాదని.. ప్రతి వార్డులోనూ సీసీ టీవీ కెమెరాలు అమర్చాలని ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.
సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించలేం : సుప్రీంకోర్టు
దిల్లీ: ఆసుపత్రులేమీ పోలీసు స్టేషన్లు కాదని.. ప్రతి వార్డులోనూ సీసీ టీవీ కెమెరాలు అమర్చాలని ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈమేరకు ‘ఆల్ ఇండియా కన్సూమర్ ప్రొటెక్షన్ అండ్ యాక్షన్ కమిటీ’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. విస్పష్టమైన వినతులతో మరోసారి రావాలని ఆదేశించింది. దేశంలోని అన్ని ఆసుపత్రుల్లోనూ సీసీ టీవీ కెమెరాలు అమర్చాలంటూ ఆదేశాలివ్వలేమని.. అక్కడ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలు కూడా ముడిపడి ఉండొచ్చని ధర్మాసనం పేర్కొంది. అలాగే వైద్యులు మందుల చీటీలను ప్రాంతీయ భాషల్లో రాయాలంటూ స్వచ్ఛంద సంస్థ చేసిన విజ్ఞాపనను కూడా తోసిపుచ్చింది. ఇదెలా సాధ్యమని ప్రశ్నించింది. కాగా పిటిషనర్ చేసిన ఒక విజ్ఞాపనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నవారికి ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతించాలన్న ఈ విజ్ఞాపనతో వస్తే పరిశీలిస్తామని తెలిపింది.
కొవిడ్-19 రోగుల నుంచి ఆసుపత్రులు, వైద్యులు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి గాను ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. ఈ అంశంపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసు ఇచ్చింది.
మారటోరియం విధింపు మా పరిధిలో లేదు
బ్యాంకుల నుంచి ప్రీ స్కూళ్ల నిర్వాహకులు తీసుకున్న రుణాల చెల్లింపుపై వడ్డీరహిత మారటోరియం విధించేలా కేంద్రప్రభుత్వం, రిజర్వు బ్యాంకులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. అది తమ పరిధిలో లేని విషయమని స్పష్టం చేసింది. ప్లే (ప్రీ) స్కూళ్ల సంఘం- ‘ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ (ఐసీఈసీఈఐ)’ తాజా పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపేందుకు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
‘వివాద పరిష్కార వ్యవస్థ’పై స్పందన తెలపండి
కొవిడ్ నేపథ్యంలో రద్దయిన 12వ తరగతి పరీక్షల ఫలితాలకు సంబంధించి వివాద పరిష్కార వ్యవస్థను సరిగా అమలు చేయడంలో సీబీఎస్ఈ విఫలమైందంటూ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈ నెల 18 లోపు స్పందన తెలియజేయాల్సిందిగా జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవిలతో కూడిన ధర్మాసనం సీబీఎస్ఈని ఆదేశించింది.
* కరోనా సంక్షోభం వేళ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర అణగారిన వర్గాల పిల్లలు ఆన్లైన్ విద్యకు దూరమవుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా హక్కు చట్టం వాస్తవరూపం దాల్చేలా సమర్థ ప్రణాళికను రూపొందించి తమకు నివేదించాలని కేంద్రం, దిల్లీ సర్కారును ఆదేశించింది.
* చెల్లని చెక్కు కేసుల్లో చర్యలు తీసుకోవడం ఆలస్యమవుతుండటం.. మన దేశంలో సులభతర వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్ఐ చట్టంలోని నిబంధనలకు సంబంధించి దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
చివరి అవకాశమిస్తున్నాం..
72 మంది అధికారిణుల శాశ్వత కమిషన్ వివాదంపై కేంద్రానికి సుప్రీం ఆదేశం సైన్యంలో 72మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ (పీసీ) మంజూరు చేయడంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రానికి మరొక్క అవకాశమిస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. పీసీ హోదా కల్పనకు సంబంధించి ఈ ఏడాది మార్చి 25న తాము జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఆ సమస్యను పరిష్కరించాలని సూచించింది. దీనిపై దృష్టిసారించాలని అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్, సీనియర్ న్యాయవాది ఆర్.బాలసుబ్రమణియన్లను జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్