Covid: చైనాకు హెచ్చరిక.. సరిహద్దులు తెరిస్తే రోజుకు 6లక్షల కేసులు!
ప్రయాణ ఆంక్షలను తొలగించి.. కొవిడ్ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కొవిడ్ కేసులు బయటపడతాయని హెచ్చరించింది.
‘జీరో కొవిడ్’ వ్యూహంపై తాజా అధ్యయనం
బీజింగ్: కొవిడ్ మహమ్మారితో కుదేలైన ప్రపంచ దేశాలు.. ఓవైపు కొవిడ్ను కట్టడి చేస్తూనే వైరస్తో కలిసి జీవించే వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కానీ, కొవిడ్-19కు పుట్టినిల్లు చైనా మాత్రం ‘జీరో కొవిడ్ (కేసుల సంఖ్య సున్నాకు తీసుకురావడం)’ వ్యూహంతోనే ముందుకెళుతోంది. దీంతో ఒక్క పాజిటివ్ కేసు నమోదైనా.. లక్షల సంఖ్యలో కొవిడ్ టెస్టులు, పకడ్బందీ ట్రాకింగ్ చేపడుతోంది. ఇదే సమయంలో విదేశీ ప్రయాణాలపై ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ చైనా మాత్రం సరిహద్దులను మూసివేయాలనే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అసలు సరిహద్దులు తెరిస్తే చైనాలో వైరస్ వ్యాప్తి ఏ మేరకు ఉంటుందనే విషయాన్ని అంచనా వేసేందుకు అక్కడి పెకింగ్ యూనివర్సిటీకి చెందిన నలుగురు గణిత శాస్త్రవేత్తల బృందం ఓ అధ్యయనం చేపట్టింది. ప్రయాణ ఆంక్షలను తొలగించి.. కొవిడ్ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కొవిడ్ కేసులు బయటపడతాయని హెచ్చరించింది.
వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడే..
అధ్యయనంలో భాగంగా అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్లలో గడిచిన ఆగస్టులో ఉన్న కొవిడ్ విజృంభణ సమాచారాన్ని విశ్లేషించారు. ఆయా దేశాలు కొవిడ్ కట్టడికి అనుసరిస్తోన్న వ్యూహాన్ని చైనాలో అమలు చేస్తే ఫలితాలు ఎంటాయనే అంచనాలను రూపొందించారు. ఆగస్టు నెలలో అమెరికాలో నిత్యం లక్షా 50 వేల పాజిటివః కేసులు బయటపడ్డాయని.. అదే వ్యూహాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కేసులు వెలుగు చూస్తాయని హెచ్చరించారు. ఒకవేళ బ్రిటన్ వ్యూహాన్ని పాటిస్తే.. రోజుకు 2.75లక్షల కేసులు వెలుగు చూస్తాయని.. అదే ఫ్రాన్స్ విధానాన్ని అమలు చేస్తే నిత్యం 4.54 లక్షల కేసులు చైనాలో బయటపడతాయని హెచ్చరించారు.
పెకింగ్ యూనివర్సిటికీ చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన తాజా అధ్యయనం చైనా సీడీసీలో ప్రచురితమైంది. మరింత సమర్థవంతమైన వ్యాక్సిన్లు, నిర్ధిష్ట చికిత్స లేకుండా సరిహద్దులను తెరవడం, బయటనుంచి రాకపోకలు సాగించేవారికి క్వారంటైన్ నిబంధనలను ఎత్తివేస్తే తీవ్ర ఇబ్బందులేనని స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే వైద్యవ్యవస్థ తట్టుకునే స్థాయిలో చైనా లేదని పేర్కొంది. ఒకవేళ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను సడలిస్తే స్థానికంగా భారీ స్థాయిలో వైరస్ విజృంభణ ఉంటుందని.. ఇది చైనా ఆరోగ్య వ్యవస్థపై భరించలేని భారాన్ని మోపుతుందని నిపుణుల బృందం అంచనా వేసింది.
మరో దారి లేదు..
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ భారీ సంఖ్యలో మ్యుటేషన్లకు గురౌతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావమున్న ఈ వేరియంట్తో మహమ్మారి నియంత్రణ, నిర్మూలనకు చేపడుతోన్న కార్యక్రమాలకు తీవ్ర సవాలుగా మారే ప్రమాదం ఉందని చైనాలోని ప్రముఖ శ్వాసకోశ నిపుణులు ఝాంగ్ నాన్షాన్ హెచ్చరించారు. ఇప్పటికే చైనాలో 76.8శాతం మందికి టీకా అందించామని అన్నారు. ఈ ఏడాది చివరినాటికి హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే లక్ష్యంతో 80శాతం మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అయితే, వైరస్ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతుండడం, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల రేటు 2శాతం ఉన్న నేపథ్యంలో వైరస్ను కట్టడి చేసేందుకు చైనాకు ‘జీరో కొవిడ్’ వ్యూహం తప్పించి మరోదారి లేదన్నారు.
ఇదిలాఉంటే, చైనాలో నిత్యం పదుల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 23కేసులు నమోదు కాగా వాటిలో 20కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలోనే వెలుగు చూశాయి. ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా అధికారులు నిర్దేశించిన హోటల్లో 21రోజులు క్వారంటైన్లో ఉండాలని నిబంధన అమలు చేస్తున్నారు. ఇలా చైనాలో ఇప్పటివరకు 98,631 కేసులు మాత్రమే వెలుగు చూసినట్లు అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. వారిలో 4636 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ప్రస్తుతం 785 మంది చికిత్స పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించడంపై ఆప్ స్పందించింది. ఆయనను చంపేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
లోక్సభ ఎన్నికల తొలి దశకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు శుక్రవారం (ఏప్రిల్ 19న) పోలింగ్ నిర్వహించనున్నారు. -
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు. -
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
Dubai Rains: దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!