IN PICS: విమానాశ్రయ సౌకర్యాలతో ‘రాణి కమలాపతి’ రైల్వేస్టేషన్
అత్యాధునిక హంగులతో ఆధునికీకరించిన ‘రాణి కమలాపతి’ రైల్వేస్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గతంలో హబిబ్గంజ్ పేరుతో ఉన్న ఈ రైల్వేస్టేషన్ను రాణి కమలాపతిగా మార్చారు.......
భోపాల్: అత్యాధునిక హంగులతో ఆధునికీకరించిన ‘రాణి కమలాపతి’ రైల్వేస్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గతంలో హబిబ్గంజ్ పేరుతో ఉన్న ఈ రైల్వేస్టేషన్ను రాణి కమలాపతిగా మార్చారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్న ప్రధాని ఈ రైల్వేష్టేషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గోండు పాలకురాలు రాణి కమలాపతి పేరుతో రైల్వేస్టేషన్కు పేరు పెట్టడంతో ఈ స్టేషన్ ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. భారతీయ రైల్వే భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతోందో ఈ రైల్వేస్టేషన్ తెలియజేస్తోందని పేర్కొన్నారు. గతంలో విమానాశ్రయంలో మాత్రమే ఉండే సౌకర్యాలు ఇప్పుడు రైల్వేస్టేషన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రూ. 450 కోట్లతో ఆధునికీకరణ
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దాదాపు రూ. 450 కోట్లతో ఈ రైల్వేస్టేషన్ను ఆధునికీకరించారు. దీనిని గ్రీన్ బిల్డింగ్గా రూపొందించారు. ఇందులో ఆధునిక, ప్రపంచస్థాయి సౌకర్యాలున్నాయి. దివ్యాంగులకు ఉపయోగపడేలా పలు నిర్మాణాలు చేపట్టారు. సమీకృత బహుళ-మోడల్ రవాణాకు కేంద్రంగా స్టేషన్ను పునరుద్ధరించారు. దేశంలో అత్యాధునిక హంగులున్న రైల్వేస్టేషన్లలో ఇది మొదటి స్థానంలో నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్