Purvanchal Expressway: రహదారిపై యుద్ధ విమానాలు.. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే విశేషాలివే!
పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండియన్ ఆర్మీకి చెందిన సి-130జె సూపర్ హెర్క్యులస్ విమానంలో దిగి చరిత్ర సృష్టించనున్నారు.
►
దిల్లీ: అత్యవసర సమయాల్లో రహదారులపైనే యుద్ధవిమానాలు దిగేందుకు వీలుగా జాతీయ రహదారులను రూపొందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపైనా ఇలాంటి ల్యాండింగ్కు కసరత్తు పూర్తయ్యింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలన కూడా విజయవంతమైంది. తాజాగా ఈ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండియన్ ఆర్మీకి చెందిన సి-130జె సూపర్ హెర్క్యులస్ విమానంలో దిగి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైమానిక విన్యాసాలను తిలకించనున్నారు. ఈ విన్యాసాల్లో ఏఎన్-32 విమానం, ఫైటర్ జెట్లు సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2000, రఫేల్ వంటి యుద్ధవిమానాలు పాల్గొని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై దిగనున్నాయి.
యుద్ధవిమానాలను దించే వీలున్న పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే రహదారి వల్ల ఉత్తర్ప్రదేశ్కు ఆర్థికంగా, సామాజిక పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రధానమంత్రి ట్విటర్లో పేర్కొన్నారు. 340.8 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల యూపీలోని లఖ్నవూ నుంచి బిహార్లోని బక్సర్ మధ్య ప్రయాణ సమయం దాదాపు మూడు గంటలు తగ్గనుంది. ఈ ఎక్స్ప్రెస్వే విశేషాలేంటో ఓసారి చూద్దాం.
✈ 340.8 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే లఖ్నవూ-సుల్తాన్పూర్ హైవేలోని చాంద్సరాయ్ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. బారాబంకి, అమేథీ, సుల్తాన్పూర్, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, ఆజంఘర్, మవూ ప్రాంతాలను కలుపుతూ చివరకు ఘాజీపూర్ జిల్లాలోని హల్దారియా గ్రామంలో ముగుస్తుంది.
✈ ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి 2018 జులై నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజంఘర్లో శంకుస్థాపన చేశారు.
✈ దాదాపు రూ.22,500కోట్ల వ్యయంతో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని చేపట్టారు.
✈ ప్రస్తుతం ఎక్స్ప్రెస్వేలో ఆరు లేన్లు ఉండగా.. భవిష్యత్లో అవసరమైతే దీన్ని 8 లేన్లకు విస్తరించుకునే వీలుంది.
✈ ఈ హైవే మధ్యలో సుల్తాన్పూర్ దగ్గర యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దాదాపు మూడు కిలోమీటర్ల దూరం రన్వే ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భారత వాయుసేన విమానాలు ఇక్కడే దిగేందుకు వీలుంది.
✈ ప్రయాగ్రాజ్, వారణాసి వంటి ముఖ్య నగరాలను కలుపుతూ వెళ్లే ఈ హైవే వల్ల కేవలం మూడున్నర గంటల్లోనే లఖ్నవూ నుంచి బక్సర్ చేరుకోవచ్చు.
✈ హైవే దారిలో మొత్తం 18 ఫ్లైఓవర్లు, ఏడు రైల్వే వంతెనలు, మరోఏడు పొడవైన వంతెనలు, 104 చిన్న బ్రిడ్జిలు, 13 చోట్ల ఇంటర్ఛేంజ్ మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ హైవేపై మొత్తం రోడ్డుకు ఇరువైపుల ప్రయాణించేందుకు వీలుగా 271 చోట్ల అండర్పాస్లు నిర్మించారు.
✈ ప్రయాణికులు సేదతీరేందుకు వీలుగా ప్రతి వంద కిలోమీటర్లకు ఒకచోట సదుపాయాలు కల్పించనున్నారు.
✈ రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, మోటారు గ్యారేజీలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.
ఇదిలాఉంటే, అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు రహదారులపై దిగడం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రారంభమైంది. తొలుత జర్మనీలో అలాంటి విన్యాసం జరిగింది. ఇక భారత్లోనూ ఈ ఏడాది సెప్టెంబరులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు రాజస్థాన్లో సత్తా-గాంధవ్ రహదారిపై ఏర్పాటు చేసిన అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్ను ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ