Vaccine for Pregnant: టీకా తీసుకున్న గర్భిణీల్లో తీవ్ర లక్షణాల్లేవ్..!
గర్భిణీలు, పాలిచ్చే తల్లుల్లో వ్యాక్సిన్ దుష్ర్పభావాలు స్వల్పమని.. వారిలో తీవ్ర లక్షణాలు కనిపించలేదని అమెరికాలో జరిపిన తాజా అధ్యయనంలో తేలింది.
అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మందిలో స్వల్ప దుష్ప్రభావాలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. కొవిడ్ లక్షణాల మాదిరిగానే ఉండే ఈ ప్రతిస్పందనలు ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, గర్భిణీలు, పాలిచ్చే తల్లుల్లో ఇటువంటి దుష్ప్రభావాలు తక్కువేనని తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 17వేల మందిపై జరిపిన అధ్యయనంలో గర్భిణీలు కానివారితో పోలిస్తే గర్భంతో ఉన్నవారు, పాలిచ్చే తల్లుల్లో వ్యాక్సిన్ దుష్ర్పభావాలు స్వల్పమని.. వారిలో తీవ్ర లక్షణాలు కనిపించలేదని తేలింది. తాజా అధ్యయనం జర్నల్ ఆఫ్ అమెరికా మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్లో ప్రచురితమైంది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మహిళల్లో దుష్ర్పభావాలను అంచనా వేసేందుకు అమెరికా నిపుణులు ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో పాల్గొన్న 17వేల ఐదువందల మంది గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తమ స్పందనను తెలియజేశారు. వీరిలో 44శాతం మంది గర్భిణీలు, 38శాతం మంది పాలిచ్చే మాతృమూర్తులు ఉన్నారు. వీరిలో 62శాతం మంది ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోగా.. మిగతా వారు ఇతర టీకాలు తీసుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించగా.. గర్భిణీల్లో కొవిడ్ వ్యాక్సిన్ రియాక్షన్లు తక్కువగానే ఉన్నట్లు గుర్తించామని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన ప్రొఫెసర్ లిండా ఎక్కర్ట్ పేర్కొన్నారు. కేవలం ఇంజక్షన్ ఇచ్చిన చోట నొప్పి ఉందని 91శాతం మంది చెప్పారు. 31శాతం మంది అలసట అనిపించినట్లు చెప్పగా.. కొందరు మాత్రమే స్వల్ప జ్వరం ఉందని వివరించారు. కేవలం ఐదు నుంచి ఏడు శాతం మంది వ్యాక్సిన్ తర్వాత పాల లభ్యత తగ్గినట్లు గుర్తించామన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్లు గర్భిణీలకు సురక్షితమని తెలియడంతోపాటు, వ్యాక్సిన్లను వారు సమర్థంగా తట్టుకోగలరనే విషయం తాజా అధ్యయనం ద్వారా మరోసారి స్పష్టమవుతోందని లిండా ఎక్కర్ట్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లపై పలు సందేహాలు నెలకొన్న వేళ ఈ అధ్యయనం ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇతర వ్యాక్సిన్లను గర్భిణీలు, పాలిచ్చే తల్లులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు మా అధ్యయనం కీలకంగా మారుతుందని లిండా ఎక్కర్ట్ వెల్లడించారు.
ఇదిలాఉంటే, భారత్లోనూ గర్భిణీ స్త్రీలు కరోనా వ్యాక్సిన్ను నిర్భయంగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. దేశంలో అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలు గర్భిణులకు ఎలాంటి హాని చేయవని అధ్యయనాలు సారాంశాన్ని నొక్కి చెబుతోంది. గర్భిణీ స్త్రీలకు వైరస్ సోకితే వారితో పాటు గర్భంలో ఉన్న బిడ్డకు కూడా హాని కలిగే అవకాశం ఉందని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకు టీకా పంపిణీ విధానంపై మార్గదర్శకాలు విడుదల చేసిన ఆరోగ్యశాఖ.. వారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?