LK Advani: అడ్వాణీ 94వ పుట్టినరోజు.. వేడుకల్లో ఉపరాష్ట్రపతి, ప్రధాని
మాజీ ఉప ప్రధాని, భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అడ్వాణీ (LK Advani) తాజాగా 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రతో పాటు సీనియర్ మంత్రులు ఎల్కే అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు.
భాజపా అగ్రనేతను కొనియాడిన పార్టీ సీనియర్ నేతలు
దిల్లీ: మాజీ ఉప ప్రధాని, భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అడ్వాణీ (LK Advani) తాజాగా 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం నేరుగా అడ్వాణీ నివాసానికి వెళ్లిన నేతలు.. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం పలు విషయాలపై ఆయనతో ముచ్చటించారు.
అంతకుముందు ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘అడ్వాణీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా. ప్రజల సాధికారత, మన సాంస్కృతిక గొప్పతనాన్ని మరింత పెంపొందించేందుకు చేసిన కృషికి గానూ యావత్ దేశం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుంది’ అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు.
అడ్వాణీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సేవలను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ముఖ్యంగా ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి మార్గనిర్దేశం చేసిన విషయాన్ని రాజ్నాథ్ గుర్తుచేశారు. అత్యంత మేధస్సు, దూరదృష్టి కలిగిన నాయకుల్లో అడ్వాణీ ఒకరని కీర్తించారు. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా కూడా అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భాజపా సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ఆయన చేసిన కృషిని కొనియాడారు.
భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంలో ఎల్కే అడ్వాణీ ఎంతో కృషి చేశారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు. అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జేపీ నడ్డా.. తొంభై ఏళ్ల వయసు దాటిన అడ్వాణీ కోట్ల మంది పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం