Pak Foreign Minister: త్వరలోనే అఫ్గాన్లో ప్రభుత్వం ఏర్పాటు..!
మరికొన్ని రోజుల్లోనే అఫ్గానిస్థాన్లో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడుతుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మూద్ ఖురేషీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆశాభావం వ్యక్తం చేసిన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి
ఇస్లామాబాద్: మరికొన్ని రోజుల్లోనే అఫ్గానిస్థాన్లో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడుతుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మూద్ ఖురేషీ ఆశాభావం వ్యక్తం చేశారు. అఫ్గాన్ నుంచి అమెరికాతో పాటు వివిధ దేశాలు సైన్యాన్ని తరలించే గడువు నేటితో (ఆగస్టు 31నాటికి) ముగిసిన నేపథ్యంలో పాక్ మంత్రి ఈ విధంగా స్పందించారు. అయితే, అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు అఫ్గాన్ను ఆక్రమించుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దీనిపై తాలిబన్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే అఫ్గాన్లో ప్రభుత్వం ఏర్పడుతుందని పాకిస్థాన్ వెల్లడించడం గమనార్హం.
20ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు పూర్తి స్థాయిలో వెళ్లిపోవడంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే దేశం మొత్తం ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా కాబుల్ విమానాశ్రయాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం అమెరికా బలగాలు విడిచి వెళ్లిపోయిన హెలికాప్టర్లు, విమానాలను పరిశీలిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అయితే, అఫ్గాన్లో దాదాపు 73 విమానాలు, హెలికాప్టర్లను వదిలి వెళ్లినప్పటికీ.. వాటి వ్యవస్థలను మాత్రం నిర్వీర్యం చేసినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. దీంతో ఆ విమానాలు ఎగరలేవని, సాయుధ వాహనాలు, రక్షణ వ్యవస్థలను కూడా ఎవరూ వినియోగించలేరని అమెరికా సైన్యం తెలిపింది.
కాబుల్ నుంచి కతర్కు జపాన్ ఎంబసీ..
కాబుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అఫ్గానిస్థాన్లో ఉన్న రాయబార కార్యాలయాలతో పాటు అక్కడి పరిస్థితులపై ఆయా దేశాలు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా జపాన్ తన ఎంబసీని తాత్కాలికంగా అఫ్గాన్ నుంచి టర్కీకి మార్చింది. ప్రస్తుతం అక్కడ నుంచి కతర్కు మార్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఇక అఫ్గాన్ నుంచి ఆయా దేశాలు వారి పౌరులను తరలించగా.. మరికొంత మంది అక్కడే చిక్కుకున్నట్లు వెల్లడిస్తున్నాయి. బ్రిటన్ ఇప్పటికే 5వేల మందిని తరలించగా.. మరో వందమందికిపైగా బ్రిటన్ పౌరులు అఫ్గాన్లోనే ఉండిపోయినట్లు తెలిపింది. అమెరికాకు చెందిన దాదాపు 200మంది పౌరులు అఫ్గాన్లోనే ఉన్నట్లు సమాచారం. అఫ్గాన్ తాజా పరిణామాలపై భారత్ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కీలక అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!