Omicron: దక్షిణాఫ్రికా కంటే ముందే నెదర్లాండ్స్‌లో ఒమిక్రాన్‌ వ్యాప్తి!

ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించకముందే.. తమ దేశంలోకి ఈ వేరియంట్‌​ వ్యాపించి ఉంటుందని నెదర్లాండ్స్​ వెల్లడించింది......

Published : 30 Nov 2021 21:03 IST

ఆమ్‌స్టర్‌డ్యామ్‌: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్​ ప్రపంచ దేశాలను  గడగడలాడిస్తోంది. కొవిడ్​ అలజడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థపై ఒమిక్రాన్​ ప్రభావం ఎంత ఉంటుంది? అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ఈ తరుణంలో మరిన్ని దేశాలు ఒమిక్రాన్​ ప్రభావిత ప్రాంతాలుగా మారుతున్నాయి. రోజుకో దేశంలో వైరస్​ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. అయితే ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించకముందే.. తమ దేశంలోకి ఈ వేరియంట్‌​ వ్యాపించి ఉంటుందని నెదర్లాండ్స్​ వెల్లడించింది. ఈ నెల 24న ఒమిక్రాన్‌ గురించి డబ్ల్యూహెచ్​ఓకు దక్షిణాఫ్రికా చెప్పిందని.. అయితే తమ దేశంలో ఈనెల 19 నుంచి 23 తేదీల మధ్య తీసిన నమూనాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు నెథర్లాండ్స్​ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఒమిక్రాన్‌ ఎప్పుడు, ఎక్కడ పుట్టిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆసియాలోని పలు దేశాలకు ఒమిక్రాన్​ విస్తరిస్తోంది. తాజాగా.. జపాన్​లోనూ తొలి కేసు వెలుగులోకి వచ్చింది. నమీబియా నుంచి ఆదివారం టోక్యోకు వచ్చిన ఓ 30ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్​ను గుర్తించారు. అతడిని క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విమానంలో మిగిలిన ప్రయాణికులను గుర్తించి.. వారికి పరీక్ష చేసే పనిలో పడ్డారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామని ఆ దేశ చీఫ్​ కెబినెట్​ సెక్రటరీ హిరోకాజు మట్సూనో వెల్లడించారు. అటు హిందూ మహా సముద్రంలోని ఫ్రాన్స్​ ద్వీపమైన రీయూనియన్​లోనూ ఒమిక్రాన్​ కేసు బయటపడింది. 53ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త రకం వైరస్​ సోకింది. మొజాంబిక్​ నుంచి రోగి దక్షిణాఫ్రికాలో దిగి.. అక్కడి నుంచి రీయూనియన్​కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నాడు.

 

Read latest National - International News and Telugu News

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని