B.1.1529 Variant: దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్.. అసాధారణ స్థాయిలో మ్యుటేషన్లు!
దక్షిణాఫ్రికాలో మాత్రం అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురౌతున్న కొత్త వేరియంట్ (B.1.1529 )ను నిపుణులు గుర్తించారు.
అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి పలు దేశాల్లో మరోసారి విజృంభిస్తోన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కాస్త అదుపులోనే ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ.. వ్యాక్సిన్ పంపిణీ, కొవిడ్ ఆంక్షలతో వైరస్ వ్యాప్తిని చాలా దేశాలు కట్టడి చేయగలుగుతున్నాయి. కానీ, యూరప్ దేశాలు మాత్రం మరోసారి విలవిలలాడుతున్నాయి. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాలో మాత్రం అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురౌతున్న కొత్త వేరియంట్ను నిపుణులు గుర్తించారు. B.1.1529 పేరుగల ఈ వేరియంట్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు నిపుణులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్యసంస్థ.. కొత్త వేరియంట్పై చర్చించేందుకు గురువారం నాడు ప్రత్యేకంగా భేటీ అయ్యింది.
కొవిడ్ దాటికి ప్రపంచంలోని చాలా దేశాలు కుదేలైనప్పటికీ.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో మాత్రం కొవిడ్ తీవ్రత కాస్త తక్కువగానే ఉంది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా పొరుగుదేశమైన బోత్సువానాలో కొత్త వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియంట్కు సంబంధించి ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం (NICD) కూడా వెల్లడించింది.
భారీ సంఖ్యలో మ్యుటేషన్లు..
B.1.1529 పేరుతో పిలుస్తోన్న ఈ వేరియంట్ అసాధారణ రీతిలో భారీ సంఖ్యలో మ్యుటేషన్లకు గురౌతున్నట్లు లండన్లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బలౌక్స్ పేర్కొన్నారు. ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే దీర్ఘకాలిక హెచ్ఐవీ రోగిలో ఈ రకం ఉద్భవించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ వేరియంట్ విస్తృతి ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. మరికొంతకాలం వైరస్ ప్రాబల్యాన్ని పర్యవేక్షిస్తూ.. విశ్లేషించాల్సి ఉందని డాక్టర్ బలౌక్స్ వెల్లడించారు. భవిష్యత్తులో వైరస్ వ్యాప్తి మరింత పెరిగితే తప్పితే.. ప్రస్తుతానికి ఈ రకంపై ఆందోళనపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం