Nawab Malik: ‘ఆ హోటల్ సీక్రెట్స్’తో.. త్వరలోనే మీ ముందుకు!
వాంఖడే వేసుకున్న చొక్కా ఖరీదు రూ.70వేల, ప్యాంటు విలువ లక్ష రూపాయలంటూ ఆరోపణలు చేసిన నవాబ్ మాలిక్.. తర్వలోనే మరిన్ని సీక్రెట్స్ బయటపెడుతానని పేర్కొన్నారు.
దీపావళి తర్వాత బయటపెడతానన్న నవాబ్ మాలిక్
ముంబయి: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఆర్యన్ ఖాన్ కేసుకు నేతృత్వం వహిస్తోన్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్పై ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. వాంఖడే వేసుకున్న చొక్కా ఖరీదు రూ.70వేల, ప్యాంటు విలువ లక్ష రూపాయలంటూ ఆరోపణలు చేసిన నవాబ్ మాలిక్.. తర్వలోనే మరిన్ని సీక్రెట్స్ బయటపెడుతానని పేర్కొన్నారు. దీపావళి తర్వాత వచ్చే ఆదివారం మరిన్ని ‘సీక్రెట్స్’తో మీ ముందుకు వస్తానంటూ ట్విట్ చేశారు.
‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ది లలిత్ (The Lalit) హోటల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిన్నింటితో ఆదివారం మీ ముందుకు వస్తా’ అంటూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. అయితే, వాంఖడే, ఫడణవీస్ కుటుంబాలపై వరుస ఆరోపణలు గుప్పిస్తోన్న నవాబ్ మాలిక్.. తాజాగా వీరికి సంబంధించిన మరిన్ని రహస్యాలనే బయటపెడతానని పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే అంతకుముందుకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కుటుంబంపై నవాబ్ మాలిక్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన ఫడణవీస్.. దీపావళి తర్వాత నవాబ్ మాలిక్ ఆరోపణలకు సమాధానం చెబుతామని ఈ మధ్యే ప్రకటించారు. ముఖ్యంగా నవాబ్ మాలిక్కు అండర్ వరల్డ్తో ఉన్న సంబంధాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని వెల్లడించారు. ఫడణవీస్ వ్యాఖ్యలకు బదులిచ్చిన నవాబ్ మాలిక్.. నాపై వేలెత్తి చూపే ధైర్యం ఎవ్వరికీ లేదన్నారు. ఒకవేళ అండర్ వరల్డ్తో అటువంటి సంబంధాలే ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫడణవీస్ ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. ఇలా ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం.. దీపావళి తర్వాత మరిన్ని రహస్యాలను బయట పెడుతామని ప్రకటించడం ముంబయి డ్రగ్స్ వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.