Trilochan Singh: నేషనల్ కాన్ఫరెన్స్ కీలక నేత అనుమానాస్పద మృతి!
నేషనల్ కాన్ఫరెన్స్లో కీలక నేతగా ఉన్న త్రిలోచన్ సింగ్ వజీర్ (67) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దిల్లీ మోతీనగర్లోని ఓ అపార్టుమెంటులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
హత్య కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు
దిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ కీలకనేతగా త్రిలోచన్ సింగ్ వజీర్ (67) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దిల్లీ మోతీనగర్లోని ఓ అపార్టుమెంటులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆయనను ఎవరో హత్య చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. హర్పీత్సింగ్ ఖల్సా అనే వ్యక్తి ఆ గదిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నట్లు భావిస్తోన్న పోలీసులు.. ఆయన కోసం గాలింపు ముమ్మరం చేశారు. త్రిలోచన్ సింగ్ వజీర్ది హత్యగానే భావిస్తున్నప్పటికీ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి విషయాలు తెలుస్తాయని దిల్లీ పోలీసులు వెల్లడించారు.
జమ్మూ కశ్మీర్ గురుద్వారా బోర్డు చీఫ్గా ఉన్న త్రిలోచన్ సింగ్, ప్రైవేటు ట్రాన్స్పోర్టర్గానూ పేరుంది. త్వరలోనే ఆయన కెనడాకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక నేషనల్ కాంగ్రెస్ అధినేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాకు త్రిలోచన్ సింగ్ అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. త్రిలోచన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా.. ఈమధ్యే ఆయనతో జమ్మూలో సమావేశమైనట్లు ట్విటర్లో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!