America: విదేశీ విద్యార్థులకు విమాన కష్టాలు!
వీసా జారీ ఆలస్యం కావడంతో పాటు, అమెరికా వెళ్లేందుకు విమాన సర్వీసులు తక్కువగా ఉండడం విద్యార్థులను వేధిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్, చైనా విద్యార్థులు ఛార్టర్ ఫ్లైట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఛార్టర్ విమానాలను ఆశ్రయిస్తోన్న భారత్, చైనా విద్యార్థులు
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తోన్న విలయం విదేశీ విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే వారికి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. కొవిడ్ ఉద్ధృతి సమయంలో అమెరికాలో చదువుతున్న విద్యార్థులు తమ స్వస్థలాలకు రాగా.. తాజాగా అక్కడ కొవిడ్ ఉద్ధృతి తగ్గడంతో మళ్లీ తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీరికితోడు ఈ ఏడాది కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలనుకునే వారికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వీసా జారీ ఆలస్యం కావడంతో పాటు, అమెరికా వెళ్లేందుకు విమాన సర్వీసులు తక్కువగా ఉండడం వారిని వేధిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్, చైనా విద్యార్థులు ఛార్టర్ ఫ్లైట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఓవైపు వీసా జారీలో ఆలస్యం..
అమెరికాలో ఉన్నతవిద్య కోసం ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10లక్షల మంది విదేశీ విద్యార్థులు వెళ్తుంటారు. వీరిలో చైనా, భారత్ల నుంచే అధికంగా ఉంటారు. ప్రస్తుతం అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా భారత విద్యార్థులకు వీసా జారీలో తీవ్ర ఆలస్యం అవుతోంది. ఇక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో అమెరికా సిబ్బంది తక్కువగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. కరోనా విజృంభిస్తోన్న వేళ కాన్సులేట్ సిబ్బంది అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం వీసా అపాయింట్మెంట్ల కోసం భారత విద్యార్థులు వేచిచూడాల్సి వస్తోంది. అంతేకాదు వీసా రాకముందే అమెరికా ప్రయాణానికి ముందస్తుగా విమాన టికెట్ బుక్ చేసుకున్న వారికి ఇది మరింత కష్టంగా మారింది. వీటితోపాటు ఆయా దేశాల్లో అనుసరిస్తోన్న వ్యాక్సిన్ విధానం కూడా విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థులకు సమస్యగా మారింది.
మరోవైపు విమాన కష్టాలు..
వీసా జారీలో ఇబ్బందులు ఇలా ఉంటే, మరోవైపు ఇప్పటికే అక్కడ అడ్మిషన్ పొందిన విద్యార్థులతో పాటు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన పూర్వ విద్యార్థులు తీవ్రంగా ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా అమెరికాకు విమాన సర్వీసులు భారీగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. చైనా నుంచి 2019 జులైలో దాదాపు 1626 విమాన సర్వీసులు (4లక్షల 79వేల సామర్థ్యం) నడవగా.. ఈ ఏడాది కేవలం 61 విమాన సర్వీసులు(20వేల సీట్లు) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత్లోనూ ఇదే పరిస్థితి. మరోవైపు విమాన ఛార్జీలు విపరీతంగా పెరగడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. గతంతో పోలిస్తే దాదాపు 5రెట్లు ఎక్కువగా ప్రయాణ ఛార్జీ చెల్లించాల్సి వస్తోందని చైనా, భారత్ విద్యార్థులు వాపోతున్నారు. వీటిని భరించేందుకు సిద్ధమైనప్పటికీ ప్రయాణ సమయానికి విమాన సర్వీసులు రద్దు అవుతుండడం మరో సమస్యగా మారింది. దీంతో ఛార్టర్ ఫ్లైట్లను ఆశ్రయిస్తున్నట్లు చైనీస్ స్టూడెంట్స్ అసోసియేషన్ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో భారత విద్యార్థులు కూడా ఛార్టర్ విమానాలవైపు మొగ్గుచూపుతున్నారు.
అమెరికాలో చదువులపై అంతర్జాతీయంగా ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. ఇలా లక్షల మంది అక్కడ చదువుకోవడం వల్ల అమెరికా ప్రభుత్వానికి ప్రతిఏటా వేల కోట్ల రూపాయలు (దాదాపు 38బిలియన్ డాలర్లు) ఆదాయంగా వస్తోంది. కానీ, కరోనా మహమ్మారి వల్ల అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నారని న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీలోని అంతర్జాతీయ వ్యవహారాల ఇంఛార్జ్గా ఉన్న ప్రొఫెసర్ వెండీ వోల్ఫోర్డ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి