Flight: అంతర్జాతీయ విమానాలకు భారత్ పచ్చజెండా
అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్ పచ్చజెండా ఊపింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరించనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన
డిసెంబర్ 15 నుంచి రాకపోకలు
దిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్ పచ్చజెండా ఊపింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరించనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా వచ్చిన తర్వాత భారత్ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించినా.. కొన్ని దేశాలతో ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం కుదుర్చుకొని.. పరిమిత ఆంక్షలతో ప్రత్యేక విమానాలను నడుపుతూ వచ్చింది. తాజా ప్రకటనతో ఇక భారత్ నుంచి, బయటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణాఫ్రికాలో వచ్చిన కొత్త వేరియంట్ కారణంగా.. ప్రభుత్వం శుక్రవారం యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్సువానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించింది. ఇందులో ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం ఉన్న దేశాలకు ఎప్పట్లానే ప్రత్యేక విమాన సర్వీసులు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు