India Corona: కట్టడిలోనే మహమ్మారి.. ఈ రోజు ఎంతమందికి కరోనా సోకిందంటే..?

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండోరోజు 9 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం 11,50,538 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,119 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Updated : 25 Nov 2021 12:22 IST

98.33 శాతానికి చేరిన రికవరీ రేటు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండోరోజు 9 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం 11,50,538 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,119 మందికి పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో 396 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. 4,66,980 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళలో 4,280 కొత్త కేసులు.. 308 మరణాలు నమోదయ్యాయని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టి 539 రోజుల కనిష్ఠానికి చేరింది. దాంతో కరోనా బాధితుల సంఖ్య 1,09,940కి తగ్గింది. నిన్న 10,264 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3.39 కోట్ల మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. క్రియాశీల రేటు 0.32 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.33 శాతానికి పెరిగింది. మరోపక్క నిన్న 90 లక్షల మందికి పైగా టీకా వేయించున్నారు. ఇప్పటి వరకు మొత్తం డోసుల పంపిణీ 119 కోట్ల మార్కు దాటినట్లు కేంద్రం వెల్లడించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని