Corona : తగ్గిన కొత్త కేసులు.. పెరిగిన రికవరీలు

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే తాజా కేసుల్లో

Updated : 31 Oct 2021 11:09 IST

దిల్లీ : దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే తాజా కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 13 వేల దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

గడిచిన 24 గంటల్లో 11,35,142 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,830 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

నిన్న 446 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,58,186కి చేరింది.

కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం కాస్త ఊరట నిచ్చే అంశం. తాజాగా 14,667 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.36 కోట్లు(98.20%) దాటింది.

ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,59,272కి తగ్గి 247 రోజుల కనిష్ఠానికి చేరింది.

ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 68,04,806 మందికి టీకా డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన మొత్తం డోసుల సంఖ్య 1.06 కోట్లు దాటింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని