Reopening Schools: పాఠశాలలపై నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరమే..!
కరోనా వైరస్ మహమ్మారి కారణంతో సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలు తెరవకపోవడం ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.
పలు సూచనలు చేసిన పార్లమెంటరీ కమిటీ
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంతో సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలు తెరవకపోవడం ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని నిర్లక్ష్యం చేస్తే కుటుంబాల సామాజిక స్థితులపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా ఇంటిపనుల్లో చిన్నారుల ప్రమేయాన్ని మరింత పెంచుతుందని స్పష్టం చేసింది. అందుచేత పాఠశాలలు తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు వేయాలని సూచించింది.
‘ఏడాదికిపైగా పాఠశాలలు మూతపడడం చిన్నారుల శ్రేయస్సుపై.. ముఖ్యంగా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాఠశాలలు తిరిగి ప్రారంభించకపోవడం వల్ల కలిగే ప్రమాదాలను విస్మరించలేం. స్కూళ్లకు దూరంగా ఉంటూ.. పిల్లలు నాలుగు గోడలకే పరిమితం కావడం తల్లిదండ్రుల, చిన్నారుల మధ్య సంబంధంపైనా ప్రతికూల ప్రభావం చూపెడుతుంది’ అని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ఇవి కుటుంబాల సామాజిక స్థితిని ప్రభావం చేయడం, బాల్య వివాహాలకు దారితీయడంతో పాటు మహమ్మారికి ముందున్న అభ్యసన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని పేర్కొంది. వీటిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను తిరిగి తెరవడం అత్యంత అవసరమని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది.
విద్య, మహిళలు, చిన్నారులు, యువతతో పాటు క్రీడలకు సంబంధించి స్కూళ్ల మూసివేత, ఆన్లైన్-ఆఫ్లైన్, పరీక్షలు, పాఠశాలలు పునఃప్రారంభంపై వినయ్ పీ సహాస్రబుద్దే నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్ తాజా నివేదికలో ఈ వివరాలు పేర్కొంది. సంక్షోభ సమయంలో పరిస్థితుల తీవ్రతను విస్మరించకూడదన్న కమిటీ, పాఠశాలలను తిరిగి తెరవడానికి హేతుబద్ధమైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
వ్యాక్సిన్ పొందడంతో సాధ్యమే..
టీచర్లు, పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థులకు వ్యాక్సిన్ అందించడం ద్వారా సాధ్యమైనంత త్వరగా పాఠశాలలను తిరిగి ప్రారంభించవచ్చని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ముఖ్యంగా రోజు తప్పించి రోజు లేదా రెండు షిఫ్టుల్లో తరగతులను నిర్వహించడం వల్ల భౌతిక దూరాన్ని పాటించడం వీలవుతుంది. ర్యాండమ్ పద్ధతిలో పిల్లలు, సిబ్బందికి కొవిడ్ టెస్టులు నిర్వహించడం, మాస్కులు, శానిటైజర్ల వాడకం వంటి జాగ్రత్తలతో తరగతులను తిరిగి ప్రారంభించే ఆస్కారం ఉంటుందని సిఫార్సు చేసింది. వీటికి తోడు ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచుకోవడం, వాటికి శిక్షణ కలిగిన సిబ్బందిని నియమించుకోవడం, ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంచడం వంటి చర్యలనూ సూచించింది. ఆరోగ్య అధికారుల పర్యవేక్షణతో కొవిడ్ నిబంధనలు అమలు చేయవచ్చని పేర్కొంది. పాఠశాలలను తిరిగి తెరవడంలో ఉత్తమ విధానాలు అనుసరిస్తోన్న వివిధ దేశాల చర్యలను పరిగణలోకి తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.