Omicron Scare: ఒమిక్రాన్ గుప్పిట్లో ప్రపంచం.. రికార్డు కేసులతో ఐరోపా దేశాలు విలవిల..!
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దేశాలన్నీ ఆంక్షల ఛట్రంలోకి వెళ్లినప్పటికీ.. ఆ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దేశాలన్నీ ఆంక్షల చట్రంలోకి వెళ్లినప్పటికీ.. ఆ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వరుసగా రెండోరోజు 10లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఐరోపా రికార్డు కేసులతో సతమతమవుతోంది. ఫ్రాన్స్లో మునుపెన్నడూ లేని విధంగా 1,79,807 కేసులు వెలుగుచూశాయి. క్రిస్మస్ కారణంగా ముందురోజుల్లోని కేసులను చూపడం వల్ల ఈ సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే జనవరి ప్రారంభంలో ఒక్కరోజే 2,50,000 కేసులు రావొచ్చని అక్కడి ఆరోగ్యమంత్రి ఇదివరకే హెచ్చరించారు. మరింత క్లిష్టమైన రోజులు ముందున్నాయని అక్కడి వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ ఫ్రాన్స్తో పాటు ఇటలీ, గ్రీస్, పోర్చుగల్, ఇంగ్లండ్లో కూడా రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి.
బ్రిటన్లో అప్పుడు కఠినఆంక్షలు తప్పవు..
బ్రిటన్లో 1,29,471 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడికి చేయడానికి కొత్త ఆంక్షలు తీసుకురావడం లేదని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించిన మరుసటి రోజే ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రజలంతా కొవిడ్ నియమావళిని పాటిస్తూ.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకాలని బ్రిటన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఒకవేళ వైద్య వ్యవస్థ కుప్ప కూలిపోయేదశకు చేరుకుంటే.. ఆంక్షలను కఠినతరం చేస్తామని హెచ్చరించింది. ఇప్పటివరకు డిసెంబర్ 24న అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్య 1,22,186గా ఉంది.
అమెరికాలో 58.6 శాతం ఒమిక్రాన్ కేసులే..
సీడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా కొత్త కేసుల్లో 58.6 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉన్నాయి. డిసెంబర్ 25 వరకు గణాంకాలను పరిగణలోకి తీసుకొని సీడీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకోవైపు అమెరికాలో రికార్డు స్థాయిలో 4,41,278 కేసులు బయటపడ్డాయి. ఆ దేశంలో కరోనా అడుగుపెట్టినదగ్గరి నుంచి ఇవే అత్యధిక కేసులు. అలాగే అక్కడ ఐసోలేషన్, క్వారంటైన్ సమయాన్ని 10 రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయం అమెరికన్లలో గందరగోళాన్ని సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు. కరోనా నెగెటివ్ వచ్చిందో, లేదో పట్టించుకోకుండా ప్రజలు ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలతో కలుపుకొని కరోనా కొత్త కేసులు 10 లక్షల మార్కు దాటడంపై స్పందించింది. ఒమిక్రాన్తో తీవ్ర ముప్పు పొంచి ఉందని, వైద్య వ్యవస్థలను ముంచెత్తుతుందని హెచ్చరించింది. వ్యాప్తిని నివారించేందుకు కఠినచర్యలు చేపట్టాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా