Fire Accident: ఐసీయూలో అగ్ని ప్రమాదం.. 10 మంది కరోనా రోగుల మృతి

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది

Updated : 06 Nov 2021 14:04 IST

అహ్మద్‌నగర్‌ : మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మద్‌నగర్‌ జిల్లా ఆస్పత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉదయం 11.30 గంటల సమయంలో కరోనా వార్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆ వార్డులో 17 మంది చికిత్స పొందుతున్నారు. అధికారులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని