Farm Laws: సాగుచట్టాల రద్దు.. అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఉద్యమం ఆగదు!
వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చే వరకూ తమ ఉద్యమం ఆగదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.
భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన రైతు సంఘాలు
దిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చే వరకూ తమ ఉద్యమం ఆగదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. అంతేకాకుండా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాటిపై స్పష్టత వచ్చేవరకూ ఇప్పటికే తలపెట్టిన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో నేడు దిల్లీలో భేటీ అయిన వివిధ రైతు సంఘాల నేతలు.. నవంబర్ 27న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
‘వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై చర్చించాం. ఇందులో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తాం. ముఖ్యంగా నవంబర్ 22న యూపీలో జరిగే మహాపంచాయత్, నవంబర్ 26న దిల్లీ సరిహద్దుల్లో నిరసనలతోపాటు నవంబర్ 29న తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ను చేపడతాం’ అని రైతునేత బల్బార్ సింగ్ రాజేవాల్ పేర్కొన్నారు. అంతేకాకుండా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, విద్యుత్ సవరణ బిల్లు రద్దు, రైతులపై కేసుల ఎత్తివేత వంటి డిమాండ్లను తెలియజేస్తూ ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాస్తామని వెల్లడించారు. ఇక రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, మరణించిన అన్నదాతలకు పరిహారం, లఖింపూర్ ఖేరీలో రైతులపై కారు దాడి వంటి ఘటనలను కూడా సమావేశంలో చర్చించామని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ వెల్లడించారు.
ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 24న జరిగే కేంద్ర కేబినెట్ భేటీలోనే వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి తీర్మానం చేయనున్నట్లు సమాచారం. అయినప్పటికీ సాగు చట్టాల రద్దుపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.
పీఎంకేర్స్ నుంచి సహాయం అందించండి..
‘కేంద్ర ప్రభుత్వం తమ తప్పిదాన్ని ఒప్పుకొని సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో వీటికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. గడిచిన ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతోన్న నిరసనల్లో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రైతు సంఘాలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా దిల్లీ సరిహద్దులో కొనసాగిన ఆందోళనల సమయంలో ఆత్మహత్య చేసుకున్న రైతులతోపాటు లఖింపూర్ కారు దాడిలో మరణించిన వారికి పీఎం కేర్స్నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలి’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. పీఎం కేర్స్లో లెక్కకు రాని డబ్బు ఎంతో ఉందని ఆరోపించిన ఆయన.. కేవలం రైతులకు క్షమాపణ చెబితే సరిపోదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?